రామోజీ ఆలోచనలలో మార్పు వచ్చిందా?

హైదరాబాద్: తెలుగు మీడియారంగ దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నాస్తికుడని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరంలేదు. తెలుగువారందరికీ అది తెలిసిన విషయమే. కమ్యూనిస్ట్ భావజాలం నిండిన రామోజీ తన చిత్రనిర్మాణసంస్థకుగానీ, ఇతర సంస్థలకుగానీ దేవుడి పేర్లు పెట్టలేదు. సంస్థకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలలోగానీ, వార్షికోత్సవాలలోగానీ, ఇతర కార్యక్రమాలలోగానీ పూజలలో ఆయన పాల్గొనరు. ఈ మధ్యదాకా రాశిఫలాలను, తిథి-నక్షత్రాలను ఈనాడులో ఇచ్చేవారుకాదు(కుమారుడు కిరణ్ అజమాయిషీలోకి వచ్చిన తర్వాత ఆ విధానం మారిందనుకోండి).

అయితే నిన్న పేపర్‌లు చూసినవారికి దైవభక్తి విషయంలో రామోజీ ఆలోచనలు మారాయా అని సందేహం కలుగుతోంది. శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తీసుకోవటానికి ఒడిషా వెళ్ళిన రామోజీ, అక్కడున్న సుప్రసిద్ధ పూరి జగన్నాథుడి ఆలయాన్ని సందర్శించటమే కాకుండా నుదుటిన బొట్టుపెట్టుకుని మీడియాకు కనిపించారు. పూజారులు ఇచ్చిన శేషవస్త్రాన్నికూడా పైన కప్పుకున్నారు. ఇది ఆయన గురించి తెలిసినవారందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎనభయ్యో పడికి చేరువైన రామోజీ(నవంబర్ 16, 1936) జీవితపు చరమాంకంలో ఆధ్యాత్మికంవైపుకు మళ్ళారా అని చర్చ జరుగుతోంది. మార్గదర్శి విషయం, కొడుకు సుమన్ చనిపోవటంవంటి విఘాతాలను ఎదుర్కోవటంవలన ఆయన ఆలోచనాధోరణి మారిందా అనే వాదనకూడా వినబడుతోంది.

అయితే దీనంతటికీ భిన్నంగా మరో వాదన వినిపిస్తోంది. ఫిల్మ్‌సిటీలో రామోజీరావు ప్రతిష్ఠాత్మకంగా ఆధ్యాత్మిక నగరం ఓం సిటీ నిర్మాణాన్ని ప్రారంభించారు(అప్పుడే కొందరు సందేహాలు లేవదీశారు… రామోజీ ఆధ్యాత్మికంవైపుకు మళ్ళారా అని). అక్కడ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలూ, దేవాలయాలన్నింటి ప్రతిరూపాలనూ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూరి ఆలయాన్ని పరిశీలించటానికి వెళ్ళి ఉంటారని అంటున్నారు. ఈ వాదనలోనూ సత్యంలేకపోలేదు. అయితే పూజలు-పునస్కారాలకు ఆమడ దూరంలో ఉండే రామోజి నుదుటన బొట్టు పెట్టుకోవటం,శేషవస్త్రాన్ని స్వీకరించటంమాత్రం విచిత్రంగా ఉంది. మరి ఆయన దైవం విషయంలో మనసు మార్చుకున్నారో, లేదో తెలియాలంటే ఓం సిటీ ప్రారంభమయ్యేదాకా ఆగాల్సిందేనేమో(అప్పుడు ఎలాగూ తన స్టాండ్ చెప్పక తప్పదు కదా!).

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close