తెలంగాణలో అరాచకానికి చంద్రబాబు యత్నం!
కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ఆలయం దగ్గర టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తోన్న ఏపీ పోలీసు వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ గుడికి వస్తోన్న భక్తులకు టీఆర్ ఎస్ కు ఓటు వేయొద్దని….టీడీపీకే ఓటు వేయాలని వీర లెవల్ లో ప్రచారం మొదలెట్టేశారు. చివరకు ఆ ఎన్నికల ప్రచారం బాగోతం బట్టబయలు కావడంతో అతడికి దేహశుద్ధి చేసిన భక్తులు… స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆ ఘటన పై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు బాబు తెరతీశారని కేటీఆర్ దుయ్యబట్టారు. ధర్మపురిలో డబ్బులతో దొరికిన వారు ఏపీ పోలీసులని తేలిందని ఇటవుంటి పనులు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.
అయినా ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రకంగా ఓటర్లను ప్రలోభ పెడుతోన్న ఏపీ పోలీసులపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ ఇంటిలిజెన్స్ అధికారులను బాబు దుర్వినియోగపరుస్తున్నారని అన్నారు. కాగా రాజ్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తోన్న ఏపీ పోలీసు ఒకరు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ఆలయం దగ్గర టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ దొరికిపోయారు. గత మూడు రోజులుగా అక్కడ మాటు వేసిన ఆ పోలీసు…అక్కడి భక్తులకు కారు గుర్తుకు ఓటు వేయద్దని .. సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. దీంతో సదరు పోలీసుకి దేహశుద్ధి చేసిన భక్తులు….స్థానిక పోలీసులకు అప్పగించారు.
తెలంగాణలో అరాచకానికి చంద్రబాబు యత్నం!
కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ఆలయం దగ్గర టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తోన్న ఏపీ పోలీసు వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ గుడికి వస్తోన్న భక్తులకు టీఆర్ ఎస్ కు ఓటు వేయొద్దని….టీడీపీకే ఓటు వేయాలని వీర లెవల్ లో ప్రచారం మొదలెట్టేశారు. చివరకు ఆ ఎన్నికల ప్రచారం బాగోతం బట్టబయలు కావడంతో అతడికి దేహశుద్ధి చేసిన భక్తులు… స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆ ఘటన పై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు బాబు తెరతీశారని కేటీఆర్ దుయ్యబట్టారు. ధర్మపురిలో డబ్బులతో దొరికిన వారు ఏపీ పోలీసులని తేలిందని ఇటవుంటి పనులు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.
అయినా ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రకంగా ఓటర్లను ప్రలోభ పెడుతోన్న ఏపీ పోలీసులపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ ఇంటిలిజెన్స్ అధికారులను బాబు దుర్వినియోగపరుస్తున్నారని అన్నారు. కాగా రాజ్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తోన్న ఏపీ పోలీసు ఒకరు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ఆలయం దగ్గర టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ దొరికిపోయారు. గత మూడు రోజులుగా అక్కడ మాటు వేసిన ఆ పోలీసు…అక్కడి భక్తులకు కారు గుర్తుకు ఓటు వేయద్దని .. సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. దీంతో సదరు పోలీసుకి దేహశుద్ధి చేసిన భక్తులు….స్థానిక పోలీసులకు అప్పగించారు.