‘గీతా’లో మరో సంతకం

‘బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే బొమ్మరిల్లు సినిమానే భాస్కర్ కి ఒక శాపంగా కూడా మారింది. భాస్కర్ ఎలాంటి సినిమా తీసిన ‘బొమ్మరిల్లు’ అంత గొప్పగా లేదనే విమర్శని ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో ఓకే అనిపించారు భాస్కర్. అటు అఖిల్ కి కూడా ఈ సినిమాతో కొంత ఉపసమనం లభించింది. వసూళ్ళు కూడా బావున్నాయి.
హిట్ మీద నడిచే ఇండస్ట్రీ ఇది. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ కి ఆ టాక్ రావడంతో భాస్కర్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ గీతాఆర్ట్స్ బ్యానర్‌లోనే మరో చిత్రం చేసేందుకు ఒప్పందం కుదిరిందని తెలిసింది. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ని చాలా లిమిటేషన్స్ లో తెరకెక్కించారు భాస్కర్. మేకింగ్ లోనే కాదు.. రేమ్యునిరేషన్ విషయంలో కూడా బాగా తగ్గారు. నెల జీతానికి పని చేశారని ఇన్ సైడ్ టాక్ వినిపించింది. అయితే చేయబోయే కొత్త సినిమా విషయంలో మాత్రం తనకు పూర్తి స్వేఛ్చ కావాలని భాస్కర్ కోరడం, దానికి నిర్మాత అంగీకరించడం జరిగిందట. మొత్తానికి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ భాస్కర్ కి కొత్త జోష్ ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close