గుళ్ళుతిరిగే గవర్నర్‌కు బొప్పికట్టిస్తున్న ‘ఓటుకు నోటు’

హైదరాబాద్:ఎప్పుడు చూసినా సతీసమేతంగా హాయిగా గుళ్ళూ, గోపురాలకు, ఫంక్షన్లకు, షాపింగ్‌లకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుండే గవర్నర్ నరసింహన్‌కు ఓటుకు నోటు వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. గవర్నర్ వ్యవహారశైలిపై వివిధ పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తెరాస తప్పితే అన్నిపార్టీల నాయకులూ గవర్నర్‌ను తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ ఆ పదవికి చేసిన రాజీనామా ఆమోదించకుండా గవర్నర్ ఆయనతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించటం రాజ్యాంగ ఉల్లంఘనే అని మర్రి అన్నారు. మరోవైపు సీపీఎమ్ సీనియర్ నాయకుడు నారాయణ గవర్నర్ రబ్బరు బొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విభజనబిల్లులో పొందుపరిచినట్లుగా సెక్షన్ 8ని అమలు చేయాలని, ఈ వ్యవహారంలో గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇక తెలుగుదేశంపార్టీ ఒక అడుగు ముందుకెళ్ళి గవర్నర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించింది. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అనే సామెతలాగా ఓటుకునోటు వ్యవహారం – అటు తిరిగీ ఇటు తిరిగీ గవర్నర్ ప్రాణానికి తలనొప్పిగా మారిందనటంలో సందేహంలేదు. అసలు గవర్నర్‌నే మారుస్తారనే వార్తలుకూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close