బీహార్ అసెంబ్లీ మూడవ దశ ఎన్నికలు రేపే

రేపు అంటే అక్టోబర్ 28వ తేదీన బీహార్ అసెంబ్లీకి మూడవ దశ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ మూడవ దశలో భోజ్ పూర్, బక్సర్, నలంద, పాట్న, శరన్ మరియు వైశాలి జిల్లాలలో గల 50 నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించబడతాయి. ఈ 50 స్థానాలకు మొత్తం 808 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 71 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రేపు జరుగబోయే ఎన్నికలలో ప్రత్యేకత ఏమిటంటే మొత్తం 808 మంది అభ్యర్థులలో 215 మందిపై తీవ్రమయిన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారే. ఇక మరో విశేషం ఏమిటంటే ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్ మరియు తేజశ్వీ ప్రసాద్ భవితవ్యం రేపు జరుగబోయే ఎన్నికలలో తేలబోతోంది. వారిలో తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుండి తేజశ్వీ ప్రసాద్ రాఘోపూర్ నుండి పోటీ చేస్తున్నారు. బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్, ఉపసభాపతి అమరేంద్ర ప్రతాప్ సింగ్, బీజేపీ చీఫ్ విప్ అరుణ్ కుమార్ సిన్హా తదితర ప్రముఖులు రేపు జరుగబోయే ఎన్నికలలో పోటీచేస్తున్నారు.

రేపు ఎన్నికలు జరుగబోయే 50 నియోజక వర్గాలలో మొత్తం 1,45,85,177 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు: 78,31,388, మహిళలు: 66,86,718, నపుంసకులు: 599 ఉన్నారు. రేపటి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు. సమస్యాత్మక ప్రాంతాలయిన బక్సర్, పాట్న, శరన్ జిల్లాలలో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసారు. అన్ని ప్రాంతాలలో రేపు ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలయి సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమయిన బక్సర్ జిల్లాలో కొన్ని నియోజక వర్గాలలో ముందుగానే పోలింగ్ ముగుస్తుంది. నిన్న సాయంత్రంతోనే ఈ 50 నియోజక వర్గాలలో ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇక నాల్గవ దశలో ఎన్నికలు జరుగబోయే నియోజక వర్గాలలో ప్రచారం మొదలుపెట్టాయి. మళ్ళీ నాలుగవ దశ ఎన్నికలు నవంబర్ 1వ తేదీన జరుగుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close