మత అసహనంపై నోరు విప్పిన మోడీ

భారత్ మీడియాకి ప్రధాని నరేంద్ర మోడి ఎన్నడూ చిక్కడు దొరకడు కానీ విదేశాలకు వెళ్లి అక్కడ బ్రిటన్ మీడియాకి దొరికిపోయారు. భారత్ లో పెరుగుతున్న మత అసహనం గురించి ఆయనను ప్రశ్నించేందుకు భారత్ మీడియాకు ఎన్నడూ అవకాశం దొరకలేదు. నిజానికి దొరకలేదు అనడం కంటే ఇవ్వలేదు అనడమే న్యాయంగా ఉంటుంది. కానీ బ్రిటన్ మీడియా అడిగిన ఈ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడి జవాబు చెప్పకుండా తప్పించుకోలేకపోయారు. “దేశంలో ఉన్న 125 కోట్ల మంది జనాభాలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదనే మా ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో నివసిస్తున్న ప్రతీ ఒక్కరికీ రక్షణ కల్పించవలసిన బాధ్యత మా ప్రభుత్వానిదే.125 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒకచోట ఒకటో రెండో మూడో ఇటువంటి సంఘటనలు జరుగుతుండవచ్చును. అవి తీవ్రమయినవా…లేకపోతే సాధారణ సంఘటనలా..?అని ఆలోచించకుండా చట్టం తనపని తను చేసుకొని పోతుంటుంది,” అని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close