రాజమండ్రి రోడ్డుప్రమాదంలో 22మంది మృతి

తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి శివార్లలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 22మంది మరణించారు. వీరంతా విశాఖపట్నంజిల్లా అచ్యుతాపురంమండలం మోసయ్యపేట గ్రామానికి చెందినవారు, ఒకే కుటుంబానికి చెందినవారు. పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా తిరుమలకు వెళ్ళివస్తున్నవీరు, మార్గమధ్యంలో ద్రాక్షారామం భీమేశ్వరాలయం సందర్శనకు వెళుతుండగా ఈప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న తూఫాన్ జీపు ధవళేశ్వరం వంతెనపైనుంచి కింద గోదావరిలో పడిపోయింది. దాదాపు 50 అడుగుల ఎత్తునుంచి పడటంతో జీపులోని ఒక్క బాలుడు తప్ప అందరూ చనిపోయారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాజమండ్రి వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వాహనం నపుడుతున్న వ్యక్తి నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close