వివేకా కేసులో ట్విస్ట్.. ఈ సారి సీబీఐ అధికారి టార్గెట్‌గా…

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. విచారణ జరుపుతున్న సీబీఐ అధికారుల మీద ఆరోపణలు చేస్తూ పలువురు తెర ముందుకు వస్తున్నారు. తాజాగా వివేకానందరెడ్డి వద్ద సుదీర్ఘ కాలంగా పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ బెదిరిస్తున్నారని.. సంబంధం లేని కొంత మంది పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు తనను ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ లాయర్ ద్వారా కోర్టులో పిటిషన్ వేశఆరు.

కొద్ది రోజుల కిందట కృష్ణారెడ్డి కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. వివేకా హత్య కేసులో కొంత మంది తనను బెదిరిస్తున్నారని.. తన ప్రాణానికి హాని ఉందని ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు కొంత మంది ఇతరుల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదుపై ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించానని చెబుతున్నారు.

గతంలో అనంతపురం ఎస్పీని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా కలిసి.., ఇదే తరహా ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు వేధిస్తున్నారని.. వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి వంటి పేర్లు చెప్పాలని .. డబ్బులు కూడా ఆశ చూపారని ఆయన ఫిర్యాదు చేశారు. గంగాధర్ రెడ్డి కూడా ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పడంతో ఆయనకూ పోలీసుల భద్రత కల్పించారు. ఇలా వరుసగా సీబీఐ అధికారుల మీద ఆరోపణలు చేస్తూ కొంత మందికి తెరపైకి రావడం కేసులో కీలక మలుపులకు కారణం అవుతోంది. మొత్తంగా చూస్తే సీబీఐ అధికారుల్ని డిఫెన్స్ లో పెట్టడానికి చేయగలిగినన్ని పనులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close