ఆఖరి గంటలో పది శాతం పోలింగ్..! హౌ..? ఎలా..?

గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం చివరికి 46.55 శాతంగా నమోదు అయినట్లుగా ఎస్‌ఈసీ ప్రకటించింది. ఇది తక్కువేమీ కాదు. గ్రేటర్ ఎన్నికల్లో గత ఇరవై ఏళ్లలో నమోదయిన పోలింగ్ కంటే అత్యధికం. ఓ వైపు కరోనా ప్రభావం..మరోవైపు వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్.. వరుస సెలవులు.. అన్నింటికీ మించి.. ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపని మున్సిపల్ ఎన్నిక., అయినప్పటికీ.. ఓటర్లు… 46 శాతానికిపైగా ఓట్లేశారంటే.. మరీ తీసి కట్టేం కాదనేది నిపుణుల విశ్లేషణ. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు.. అంత ఓటింగ్ ఎలా జరిగిందనే అనుమానాలు కూడా రాజకీయ పార్టీల్లో ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై రకరకాల చర్చలు ప్రారంభించారు.

ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లోఈవీఎంలు ఉపయోగించలేదు. బ్యాలెట్లు మాత్రమే వాడారు. పోలింగ్ పర్సంటేజీ విషయంలో ప్రతీ గంటకు ఎస్‌ఈసీ అప్ డేట్ ఇచ్చింది. మధ్యాహ్నం వరకూ ఇరవై శాతం కూడా నమోదు కాలేదు. సాయంత్రం ఐదు గంటల వరకు 35 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లుగా తేల్చారు. చివరి గంటలో మాత్రం దాదాపు పది శాతం పోలింగ్ నమోదయిందని నిర్ధారించారు. ఇదే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే.. ఐదు గంటల తర్వాత ఏ పోలింగ్ బూత్‌లోనూ ఓటర్లు కనిపించలేదు. సాధారణంగా ఆరు గంటలకుకూడా క్యూలైన్లు ఉంటే… పోలింగ్ శాతం పెరుగుతుందని అనుకోవచ్చు. కానీ.. గ్రేటర్‌లో అసలు ఎక్కడా ఎలాంటి క్యూలే కనిపించలేదు. దాంతో ఏకంగా పది శాతం పోలింగ్ ఎలా జరుగుతుందనేది చాలా మందికి అర్థం కావడం లేదు.

ఈవీఎంలు అయితే.. రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ బ్యాలెట్లు అయితే.. చివరి గంటలో పోలింగ్ సిబ్బంది సాయంతో.. ఏజెంట్లు చేసుకోవాలన్నది చేసుకోవచ్చు. ఎన్ని ఓట్లు ఉంటే.. అన్ని గుద్దేసి బ్యాలెట్ బాక్సుల్లో వేసి.. ఓటర్లు ఓట్లు వేశారని రాసుకోవచ్చు. ఇప్పుడు అదే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా పోలింగ్ బూతుల్లో ఇతర పార్టీల ఏజెంట్లను ఐదు గంటల కల్లాపంపేశారని.. అధికార పార్టీ ఏజెంట్లే ఉన్నారన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా.. చివరిగంటలో పదిశాతం పోలింగ్ అయిందంటే.. అది ఖచ్చితంగా ఓటర్లు వేసినవి కాదన్న అభిప్రాయం మాత్రం… రాజకీయ పార్టీలలో ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close