ప్ర‌భాస్ సినిమా కోసం 18 సెట్లు

ప్ర‌భాస్ – రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకోసం హైద‌రాబాద్‌లో ఏకంగా 18 సెట్లు వేయ‌బోతున్నారు. ఓ సినిమా కోసం ఇన్ని సెట్లు వేయ‌డం ఈ మ‌ధ్య కాలంలో ఇదే తొలిసారి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ఎస్‌.ర‌వీంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ సెట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇది రోమ్ నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌. అక్క‌డ కొంత భాగం తెర‌కెక్కించారు. వాటికి మ్యాచింగ్‌గా ఇండోర్ సీన్ల‌ని హైద‌రాబాద్‌లోనే తెర‌కెక్కిస్తున్నారు. ఇందుకోసం 18 సెట్లు అవ‌స‌ర‌మ‌య్యాయ‌ని స‌మాచారం. వీటి బ‌డ్జెట్ దాదాపు 60 నుంచి 70 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని టాక్‌. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఇప్ప‌టికే మూడు సెట్ల‌ని రూపొందించారు. క‌థానాయిక ఇంటి నేప‌థ్యంలో స‌న్నివేశాల కోసం రూ.4 కోట్ల విలువైన ఓ సెట్ ని వేశారు. మిగిలిన సెట్స్‌కీ.. భారీగానే ఖ‌ర్చు పెడ‌తార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఇట‌లీ వెళ్ల‌బోతోంది చిత్ర‌బృందం. అక్క‌డ మ‌రో నెల రోజుల పాటు కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకుని వ‌స్తారు. మొత్తానికి ప్ర‌భాస్ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతోంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close