మిషన్ కాకతీయ… రూ. 20 వేల కోట్లు వృథానా?

తెలంగాణలో చెరువులకు పూర్వ వైభవం తేవడానికి తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ విజయవంతం అయ్యే అవకాశం లేదట. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్.జి.ఆర్.ఐ.) శాస్త్రవేత్తలు సాధికారికంగా తెలిపిన వాస్తవమిది. 20 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో 46 వేలకు పైగా చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. జోరుగా పనులు చేపట్టింది. అయితే శాస్త్రీయ పద్ధతిలో కాకుండా పైపైన పనులుచేయడం వల్ల ఉపయోగం లేదని ఎన్ జి ఆర్ ఐ శాస్త్రవేత్తలు ఓ నివేదికలో స్పష్టం చేశారు. అదే నిజమైతే, 20 వేల కోట్లూ బూడిదలో పోసిన పన్నీరేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాలు గట్టి రాతి ప్రాంతాలు. అక్కడ చెరువులను తవ్వడం లేదా పునరుద్ధరించడం అనేది శాస్త్రీయ పద్ధతిలో జరగాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అక్కడ నీటి లభ్యత ఇతర అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ మిషన్ కాకతీయలో అది జరగలేదు. ఏదో తోచిన విధంగా తవ్వకాలు జరిపారుని, వీటి వల్ల నీరు నిల్వ చేసే అవకాశాలు పెద్దగా ఉండవని తేల్చారు.

ఒకప్పుడు కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఆ విధానాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది. బ్రిటిష్ ప్రభుత్వంలోని ఎంతో మంది నిపుణులు కూడా విస్తుపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువుల పునరుద్ధరణ టాప్ ప్రయారిటీగా చేపట్టారు. దీనికి మిషన్ కాకతీయ అని పేరుపెట్టారు.

ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పినదాన్ని బట్టి చూస్తే, వరంగల్ జిల్లాకు ఇతర జిల్లాలకు భౌగోళికంగా తేడా ఉంది. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కట్టించిన ప్రాంతాల్లోని పరిస్థితులు వేరు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాల భూభౌతిక స్థితిగతులు వేరు. కాబట్టి దీనికి అనుగుణంగా శాస్త్రీయమైన పద్ధతిలో పనులు చేయించాల్సింది. కానీ అలా జరగక పోవడం వల్ల 20 వేల కోట్ల రూపాయల పనులతో పెద్దగా ప్రయోజనం లేకపోతే అది బాధాకరమే. ప్రభుత్వం ముందే తగిన శాస్త్రీయమైన సూచనలు తీసుకుని పనులు మొదలుపెడితే బాగుండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close