పిక్చర్ క్లియర్: 2019లో మోదీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు..!!

భారత రాజకీయాల్లో ఇప్పుడొక క్లారిటీ వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేరుగా ఢీకొట్టబోయేది ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలే. బెంగళూరులో ప్రాంతీయ పార్టీల అధినేత చూపించిన పట్టుదలే దీనికి సాక్ష్యం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రాంతీయ పార్టీల కూటమికి బెంగుళూరులో మొదటి అడుగు పడింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రాంతీయ పార్టీలన్నీ… తమ బలాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించాయి.

ప్రాంతీయ పార్టీలన్నీ ఓ కూటమిలా ఏర్పడాలని మమతా బెనర్జీ ఆకాంక్షించారు. చంద్రబాబుతో చర్చలు జరిపారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాంతీయ పార్టీల అధినేతలను చంద్రబాబు తొలిసారి కలుసుకున్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత ఉండాలని అందరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. రాష్ట్రాల హక్కుల కోసం అందరూ పోరాడాలని నిర్ణయించారు. మోదీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీల నేతలంతా ఏకమయ్యారన్న సూచనలు దేశ ప్రజల్లోకి పంపేందుకు వ్యూహాత్మకంగా నేతలంతా ఈ వేదికను ఉపయోగించుకున్నారు. ఈ ప్రయత్నం ప్రస్తుతానికి మంచి ఫలితాలే ఇచ్చింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ విషయాన్ని పక్కన పెట్టి.. ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే బాగుంటుదన్న అభిప్రాయం అన్ని పార్టీల నేతల్లోనూ వచ్చింది. ఎన్నికల సమయానికి ఓ రూపం వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసేందుకు తమ కార్యాచరణ కొనసాగుతుందని మమతాబెనర్జీ, చంద్రబాబు ప్రకటించారు.
కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరు కాని ప్రధాన పార్టీల్లో టీఆర్ఎస్, బీజేడీ, శివసేన ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేడీ మాత్రం… కేంద్రంతో కొన్ని అంతర్గత ఒప్పందాల వల్ల హాజరు కాలేకపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇక శివసేన.. నేరుగానే బీజేపీపై తిరుగుబాటు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం..మోదీకి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చోట… మాత్రం అడ్వాంటేజ్ ఎవరికి వస్తుందన్నది కీలకంగా మారబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్ వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close