ఏపి అసెంబ్లీలో భాజపా వ్యూహమా? ఏముందని?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా శాసనసభాపక్ష సమావేశం కొద్ది సేపటి క్రితం విశాఖపట్నంలో మొదలయింది. దానికి భాజపా రాష్ట్ర మంత్రులు డా. కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, పార్టీ ఎమ్మెల్యేలు పెన్మత్స విష్ణు కుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ హాజరయ్యారు. మళ్ళీ రేపటి నుండి మొదలయ్యే శాసనసభ సమావేశాలలో తమ పార్టీ అనుసరించాల్సిన విధానం గురించి వారు చర్చిస్తునట్లు తెలుస్తోంది.

శాసనసభలో భాజపాకి మొత్తం నలుగురే సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు కనుక వారిద్దరూ కూడా తెదేపా ప్రభుత్వ విధానమే తమ విధానం అన్నట్లుగా సభలో వ్యవహరించవలసి ఉంటుంది తప్ప అందుకు భిన్నంగా వ్యవహరించలేరు. వారిద్దరూ నిలదీయలేనప్పుడు మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షంతో గొంతు కలిపి దేనిపైనా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేరు. ఒకవేళ విమర్శిస్తే సభలో ఉన్న నలుగురు భాజపా సభ్యుల మధ్యనే భిన్నాభిప్రాయాలున్నాయనే తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది.

అలాగని తెదేపాకు వంతపాడటమూ కష్టమే. ఎందుకంటే సోము వీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ వంటివారు తెదేపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చాలా తీవ్ర ఆరోపణలు చేస్తున్నపుడు, భాజపా సభ్యులు ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తే వారు కూడా ఆ అవినీతిలో భాగస్వాములనే అనుమానాలు ప్రజలలో రేకెత్తించినట్లవుతుంది. కనుక శాసనసభలో తెదేపా-వైకాపాల మధ్య జరిగే భీకర యుద్ధాన్ని భాజపా సభ్యులు మౌనంగా గమనిస్తూ కాలక్షేపం చేయడం తప్ప మరేమీ చేయలేరు. మరి అటువంటప్పుడు శాసనసభలో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించడానికి ఏముంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close