ఎన్టీఆర్ వర్థంతి : ధృవతార అంతర్థానమై పాతికేళ్లు..!

పాతికేళ్ల క్రితం ఇదే రోజు.. జనవరి పద్దెనిమిదో తేదీన ప్రపంచంలోని తెలుగు వారందరూ షాక్‌కు గురయ్యారు. ఎన్టీఆర్ మహాభినిష్క్రమణం వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఆయన కడ చూపు కోసం అశేష జనం హైదరాబాద్ తరలి వచ్చింది. రాష్ట్రంలో జనం ఎక్కడికక్కడ నివాళి అర్పించారు. మహనీయుడా మళ్లీ పుట్టు అని కోరుకున్నారు. ఓ ధృవతార అంతర్థానమైన పాతికేళ్లు గడుస్తున్నా.. ప్రజల మనసుల్లో ఎప్పటికప్పుడు వెలుగులు పెంచుకుంటూపోతున్నారు. మరపు రాని వ్యక్తిగా మదిలో ఉండిపోతున్నారు.

వెండితెరపై దైవస్వరూపం..!

కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి రైతుబిడ్డగా పయనం సాగించి.. సినీ, రాజకీయ రంగాల్లో .. చెరగని సంతకంగా మారిన మహామనిషి ఎన్టీఆర్. సినిమాల్లో తన ముద్ర ఎంత బలంగా వేశారో.. రాజకీయాల్లోనూ అలాగే మేరునగధీరుడిగా ఎదిగారు. ప్రపంచ సినీ చరిత్రలోనే దేనికవే భిన్నమైన పాత్రలను పోషించిన మహానటుడు మరె క్కడా కనిపించరు. దైవత్వానికి రూపం ఇస్తే ఇలా వుంటుందనిపించేలా వెలిగిన నిండైన విగ్రహం ఎన్టీఆర్‌. ఆయన రావణబ్రహ్మలాంటి పాత్రలు కూడా చేశారు. వాల్మీకి, వ్యాస మహర్షులు రచించిన కావ్యాలలోని రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ళకు సజీవ రూపం రామారావు. చిన్న రంగస్థల నటుడిగా జీవితాన్ని ప్రారంభించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వామనావతారం ఎన్టీఆర్‌.

రాజకీయతెరపై బలహీనవర్గాలకు అధికార ప్రదాత..!

సినిమాల్లో సాధించాల్సినదంతా సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అంటూ తెలుగు రాజకీయ రంగంలో తనదైన ముద్రవేసిన ప్రజానేత నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలతో అన్న అని పిలిపించుకున్న అజరామరుడు. నాలుగున్నర దశాబ్దాలపాటు వెండితెర వేలుపుగా, సాంఘిక, పౌరాణిక పాత్రల్లో ఆబాల గోపాలాన్ని అలరించిన మహానటుడు. తెలుగుజాతి గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి.

పేదలకు ఆత్మగౌరవ జీవితాన్నిచ్చిన పాలకుడు..!

తెలుగు సాహిత్యంపై అపారమైన పట్టున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ . ఆయన నటించిన సినిమాలన్నిటా తెలుగువారి జీవితం, సంప్రదాయం నిండుగా వుంటాయి. జీవితంలోని తాత్వికత కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీవీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి, జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్‌. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం, మునసబు వంటి ఫ్యూడల్‌ వ్యవస్థలను రద్దుచేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేశారు. అనేకమందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా గాక సాంఘిక విప్లవ సాధనంగా తీర్చిదిద్దారు. ఆద్యంతం పేదల పెన్నిధిగా జీవించారు.

కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం ఎన్.టి.ఆర్..!

రాజకీయాల్లో ఉన్న వారెవరైనా బుద్ధి పూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్ధుల ఎత్తుగడలను చిత్తుచేయడం, సొంత ఇమేజ్ పెంచుకోవడం, వంటి రాజకీయాలు ఆ నిర్ణయాల వెనుక వుంటాయి. అందుకు భిన్నంగా, హృదయ స్పందనలకు అనుగుణంగా, ప్రజలను ఓట్లుగా కాక ప్రజలుగానే చూడగల నాయకులు ఎన్ టి ఆర్. ఆయన తరువాత లేరు ఇకపై వస్తారన్న ఆశకూడా లేదు. కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం ఎన్ టి ఆర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close