వరద సాయం : ఏపీలో రూ. 500.. తెలంగాణలో రిలీఫ్ కిట్..!

అనూహ్యమైన వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్ ఇప్పటికీ నీటిలోనే ఉంది. ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. పరామర్శకు వెళ్తున్న టీఆర్ఎస్ నేతలకు బాధితులు చుక్కలు చూపిస్తున్నారు. అయితే.. అది వారి ఆకలి కోపం. దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించింది. వెంటనే రిలీఫ్ కిట్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. నిత్యావసరాలతో పాటు మూడు దుప్పట్లో కిట్‌లో ఉంటాయి. దీని విలువ రూ. 2800 వరకు ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. వెంటే పంపిణీ చర్యలు కూడా ప్రారంభించారు. దీంతో పాటు ఆస్తి నష్టం జరిగిన వారిని ఆదుకునేలా కార్యాచరణ కూడా ప్రారంభించారు.

ఏపీలో కూడా బీభత్సంగా వరదలు వచ్చాయి. అక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగింది. పంట సాయం సంగతేమో కానీ.. ఊళ్లు ఊళ్లు నీట మునగడంతో పెద్ద ఎత్తున జనాల్ని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. ఇళ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వరద పరిశీలన చేయలేదు కానీ.. తక్షణ సాయంగా ఐదు జిల్లాలకు రూ. పన్నెండు కోట్లు విడుదల చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. ఐదు వందలు ఇవ్వాలని ఆదేశించారు. ఇది అందరికీ కాదు.. కేవలం .. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికే. ఇక ఎలాంటి నిత్యావసర వస్తువుల పంపిణీ.. ఇతర సాయం ప్రకటనల్లేవు.

ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా తీరం ఎక్కువ. తుపానుల గండమే కాదు.. అతి వృష్టి గండం కూడా ఎక్కువే. అందుకే ప్రజలు ఎక్కువగా వరదలతో నష్టపోతూ ఉంటారు. కానీ ప్రభుత్వాలు సాయం చేసే విషయంలో మాత్రం… పిసినారి తనంగా వ్యవహరిస్తూ ఉంటాయి. 2019లో వరదలు వచ్చినప్పుడు ప్రకటించిన నష్టపరిహాం 2020లో వరదలు వచ్చినప్పుడు ఇచ్చారు. 2020లో వచ్చిన వరదలకు పరిహారం ఎప్పుడిస్తారో ప్రభుత్వానికే తెలియాలి. తెలంగాణలో తాత్కాలికంగా అయినా నిత్యావసర వస్తువుల కిట్ ఇచ్చి… దుప్పట్లో ఇచ్చి.. ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం.. ఐదు వందు మాత్రమే చేతిలో పెట్టాలని నిర్ణయించారు. అవి కూడా ఎప్పటికి ఇస్తారో ఊహించడం కష్టమనే విమర్శలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close