మంచు విష్ణు ఖాతాలో 60 పోస్టల్ ఓట్లు !

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చిత్రవిచిత్రంగా సాగుతున్నాయి. సాధారణ ఎన్నికల మాదిరిగా ఓట్లు కొనడం కూడా ప్రారంభమయింది. చెన్నై, వైజాగ్, బెంగళూరుల్లో నివాసం ఉంటున్న కొంత మంది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన‌్ సభ్యులతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయించాలని మంచు విష్ణు ప్యానల్ నిర్ణయించుకుంది. దానికి తగ్గట్లుగా వారిని సంప్రదించింది. వారి తరపున పోస్టల్ బ్యాలెట్లకు మంచు విష్ణు తరపు వ్యక్తి ఎన్నికల అధికారికి డబ్బులు చెల్లించారు. మొత్తం అరవై ఓట్లకు రూ. 28వేలు చెల్లించారు. అయితే ఈ విషయం తెలిసి ప్రకాష్ రాజ్ ఫైరయ్యారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తన టీం మొత్తం వచ్చి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల అధికారి కూడా స్పందించారు. కరోనా వల్ల తొలి సారి పోస్టల్ బ్యాలెట్లను పెట్టామని చెప్పారు. ఒక్క పోస్టల్ బ్యాలెట్‌కు రూ. ఐదు వందలు కట్టాలని.. ఇలా అందరి తరపున ఒక్కరే పోస్టల్ బ్యాలెట్లకు డబ్బులు చెల్లించడం సరి కాదని.. తాము వెనక్కి ఇచ్చేశామని చెప్పుకొచ్చారు. అయితే పోస్టల్ బ్యాలెట్స్ రద్దు చేయడం సాధ్యం కాదన్నారు.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టేసుకున్నారు. తాము ఏం చేస్తామో చెప్పి గెలవాలి కానీ ఇలా ఓట్లు కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మా ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులపై సీనియర్లు నోరు విప్పాలని ఆయన కోరుతున్నారు. ఓటింగ్‌కు రాలేని వాళ్లతో మాట్లాడి వాళ్ల తరపున పోస్టల్ బ్యాలెట్లను వేయించుకోవడానికి మంచు విష్ణు ప్యానల్ చురుగ్గా పని చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఓటుకు నోట్లు..ఇతర తాయిలాలు ఇస్తున్నారన్న ప్రచారం నేపధ్యంలోఈ వ్యవహారం కూడా చర్చనీయాంశం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close