మంత్రులను పంపే బదులు చంద్రబాబు పిలవచ్చు కదా? ఉమ్మారెడ్డి

రేపు సాయంత్రం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తన రాజకీయ శత్రువు, బద్ద విరోధి అయిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు.

దీనిపై వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు స్పందిస్తూ, కేసీఆర్ ని ఆహ్వానించినట్లే చంద్రబాబు నాయుడు మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ఆహ్వానించి ఉండి ఉంటే బాగుండేది. కేసీఆర్ ని ఏవిధంగా అపాయింట్ మెంటు తీసుకొని కలిసారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ తీసుకొనివచ్చి స్వయంగా పిలిస్తే మర్యాదగా ఉండేది. అయినా మా పార్టీ ప్రాధాన్యతలు మాకుంటాయి కనుక ఒకవేళ మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి వచ్చినట్లయితే ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెడతారా?” అని అన్నారు.

జగన్ స్వయంగా “నేను ఆ కార్యక్రమానికి పిలిచినా రాను. కనుక నన్ను పిలవద్దు,” అని చంద్రబాబు నాయుడుకి లిఖితపూర్వకంగా బహిరంగ లేఖ వ్రాసి మళ్ళీ ఇప్పుడు “కేసీఆర్ నిపిలిచినట్లే చంద్రబాబు నాయుడు జగన్ అపాయిట్ మెంట్ తీసుకొని స్వయంగా వచ్చి పిలవచ్చు కదా?” అని అడగడంతో మరింత నవ్వులపాలవుతున్నారు. తన ఇంటికి వచ్చిన మంత్రులని చాలా అగౌరవంగా వెనక్కి తిప్పి పంపేసి ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి పిలవాలని అడగడం చాలా హాస్యాస్పదం. అయినా ఒక ముఖ్యమంత్రి తన స్థాయికి సమానమయిన లేదా తనకంటే ఎక్కువ స్థాయి ఉన్న వ్యక్తులను స్వయంగా వెళ్లి ఆహ్వానించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకే చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులని, గవర్నర్, తెలంగాణా ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం అంత వయసుకూడా లేని జగన్మోహన్ రెడ్డి హుందాగా, గౌరవంగా వ్యవహరించి ఉండే బహుశః చంద్రబాబు నాయుడు ప్రోటో కాల్ పక్కనబెట్టి అందుకు సమ్మతించి ఉండేవారేమో? కానీ జగన్ ప్రవర్తిస్తున్న తీరు చూసి వైకాపా నేతలే సమర్ధించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మెట్టు దిగాలి?

“జగన్ వస్తే ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెడతారా?” అని ఉమ్మారెడ్డి వంటి సీనియర్ నేత చిన్న పిల్లాడిలా ప్రశ్నించడం చూస్తే చాలా నవ్వు వస్తోంది. రాష్ట్ర మంత్రులు తన ఇంటికి పిలవడానికి వస్తే వారు తన స్థాయికి సరిపోరని అహం ప్రదర్శించి జగన్ తిప్పి పంపేసారు. ముఖ్యమంత్రి వచ్చి పిలిస్తేనే తన స్థాయికి తగ్గట్లుగా గౌరవంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు ఉమ్మారెడ్డి మాటల ద్వారా అర్ధం అవుతోంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి తమ స్థాయికి సరిపోడని భావించవచ్చు కదా? నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. చంద్రబాబు నాయుడుపై నిత్యం నోరు పారేసుకొనే జగన్ పట్ల ఆయన మాత్రం ఎందుకు గౌరవంగా ప్రవర్తించాలి? అసలు ఆయనకు ఆ అవసరం ఏమిటి? అని వైకాపా నేతలు ఆలోచించుకోవాలి. జగన్ అభిప్రాయాన్నే ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు వ్యక్తపరుస్తున్నట్లయితే జగన్ “ఇగో ప్రాబ్లెం”తో బాధపడుతున్నట్లు భావించవలసి ఉంటుంది. అయినా పిలిచినా రానని గొప్పగా చెప్పుకొన్న తరువాత ఇంటికి వచ్చిన వారిని వెళ్ళగొట్టి మళ్ళీ పిలుపుల కోసం ఆశగా ఎదురు చూడటం ఎందుకో? జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ పరిపక్వత వస్తుందో..ఏమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

తేజా స‌జ్జా… క‌రెక్టు రూటులో!

'హ‌నుమాన్' లాంటి హిట్ త‌ర‌వాత ఏ హీరోకైనా కాస్త క‌న్‌ఫ్యూజన్ మొద‌లైపోతుంది. త‌ర‌వాత ఏం చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతుంటారు. ఆ గంద‌ర‌గోళంలో త‌ప్పులు...

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

ఈ విషయంలో కేసీఆర్‌ నెంబర్ వన్ !

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close