విశాఖలో ఏడు కిలోల బంగారం దోపిడి

హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలోని తగరపువలసలో భారీ దోపిడి జరిగింది. ఒక నగల దుకాణంలో ఏడుకిలోల బంగారం చోరీకి గురయింది. మెయిన్ రోడ్డులో ఉన్న ఒక నగల దుకాణం యజమాని ఈ ఉదయం షాపు తెరిచి బంగారం, వెండి ఉన్న బ్యాగ్‌ను పక్కన పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటుండగా దుండగులు బైక్‌పై వచ్చి బ్యాగ్‌ను తీసుకుని పరారయ్యారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి విచారణ ప్రారంభించారు. చుట్టుపక్కల రహదారులవద్ద గస్తీని ముమ్మరం చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. దుండగులు ముందునుంచి రెక్కీ నిర్వహించి ఈ దోపిడీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close