జమ్ము కాశ్మీర్ లో చరిత్ర పునరావృతం అవుతోందా?

జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో శనివారం ఉగ్రవాదుల దాడిలో 8మంది జవాన్లు మృతి చెందారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పాంపోర్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేసి సైనికులపై దాడి చేశారు. ఎదురు దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడికి తామే చేశామని లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవాద సంస్థ ప్రకటించుకొంది. గత 6 నెలలో ఇటువంటి సంఘటనలు చాలాసార్లు జరిగినా ఉగ్రవాదుల చేతిలో ఒకేసారి ఇంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం ఇదే మొదటిసారి.

మూడు రోజుల క్రితమే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ పాకిస్తాన్ తో మళ్ళీ స్నేహసంబంధాలు పునరుద్దరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు తన రాష్ట్రంలోనే తరచూ ఈవిధంగా దాడులు చేస్తున్నా కూడా ఆమె పాకిస్తాన్ తో స్నేహాన్నే కోరుకోవడం విశేషం. ఉగ్రవాదుల దాడులలో సైనికులు మరణించినప్పుడు ఆమె నోరు మెదపరు. మరణించిన సైనికుల, వారి కుటుంబాల పట్ల సానుభూతిగా నాలుగు ముక్కలు మాట్లాడరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జాతీయవాదంపై పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే భాజపా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి ముఫ్తీ మహబూబాతో అంటకాగుతూ ఆమె ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కనుక రాష్ట్ర భాజపా నేతలు కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటారు.

కారణాలు ఏవయితేనేమి, కేంద్రప్రభుత్వం కూడా ఇప్పుడు పఠాన్ కోట్ దాడుల గురించి మాట్లాడటం లేదు. పాక్ పై ఎటువంటి ఒత్తిడి చేయడం లేదు. అంత పెద్దదాడిని కూడా భారత్ కేవలం ఆరునెలలలో మరిచిపోగలిగింది కనుకనే చరిత్ర పునరావృతం అవుతోందని చెప్పక తప్పదు. బహుశః ఇప్పుడు కూడా కేంద్రప్రభుత్వం ఒక ఖండన ప్రకటనతో సరిపెట్టవచ్చు. దేశప్రజల రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న వీర జవాన్లను ఇది అవమానించడంగానే భావించవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close