దిల్ రాజుని కొట్టే మొనగాడు వచ్చాడు..!

ప్రస్తుతం నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ అంటే వినిపించే పేరు ఒక్కటే దిల్ రాజు. స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్ని సినిమాలు చేస్తున్నా రాజు అంతకుముందు డిస్ట్రిబ్యూటర్ అనే విషయం సినిమా వాళ్లకు బాగా తెలుసు. అమృత తెలుగు సినిమా రైట్స్ ని కొని అది కాస్త ఫ్లాప్ అవగా పెట్టా బేడా సర్దే టైంలో ఆది రూపంలో అదృష్టం తన్నుకుంటు వచ్చింది. చివరి ప్రయత్నంగా ఆది సినిమాకు ఆస్తులు తాకట్టు పెట్టి మరి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న రాజు అదృష్టం తలుపు తట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే దిల్ సినిమాతో నిర్మాతగా కూడా మార్చింది.

నిర్మాతగా స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేస్తున్న దిల్ రాజు నిర్మాతగా కన్నా డిస్ట్రిబ్యూటర్ గా బాగా ఆలోచిస్తాడు. అందుకే తను నిర్మించని పెద్ద హీరో సినిమాలను కూడా ఇప్పటికీ తాను డిస్ట్రిబ్యూట్ చేస్తూ లాభాలు ఘడిస్తుంటాడు. బాహుబలి సినిమా నైజాం ఏరియా మొత్తం రిలీజ్ చేసింది దిల్ రాజే. ఆ సినిమా లాభాల్లో అసలు ప్రొడ్యూసర్లు ఆర్కా మీడియా వారి కన్నా డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ఎక్కువ సొమ్ము పోగేసుకున్నాడు.

అయితే ఇన్నాళ్లు నైజాంలో నిరంతరాయంగా కొనసాగిన దిల్ రాజు ప్రస్థానానికి అడ్డుకట్ట వేయడానికి వచ్చాడు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్. శ్రీమంతుడు సినిమాతో డిస్ట్రిబ్యూషన్ రంగంలో దిగిన అభిషేక్ పిచర్స్ వారు సినిమాలను నైజాం ఏరియాల్లో ఫ్యాన్సీ ప్రైజ్ ఇచ్చి మరి కొనుక్కుంటున్నారు. శ్రీమంతుడు సినిమా 14 కోట్లకు పైగా కొని షాక్ ఇచ్చిన వీరు ఆ సినిమాకు అంత పెట్టి కొని అందరిని అవాక్కయ్యేలా చేశారు. చివరకు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మిగులు 5 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది.

అయితే ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాను కూడా అభిషేక్ పిక్చర్స్ వారే తీసుకున్నారని టాక్. దిల్ రాజు చెప్పిన ప్రైజ్ కన్నా సర్ ప్రైజింగ్ ప్రైజ్ తో ఎన్.టి.ఆర్ సినిమాను దక్కించుకున్నారట. మరి చూస్తుంటే నైజాంలో దిల్ రాజు కి చెక్ పెట్టే మొనగాడు దొరికినట్టే అనిపిస్తుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close