ద గ్రేట్ రాబ‌రీ దొంగ‌ల ప‌ట్టివేత‌

ప‌క్కా స్కెచ్, ప‌క‌డ్బందీగా రెక్కీ, ప‌ర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముత్తూట్ ఫైనాన్స్ లో ప‌ట్ట‌ప‌గ‌లు దోపిడీ చేసిన దొంగ‌ల్లో ఇద్ద‌రి ఆట క‌ట్టించారు పోలీసులు. ముంబైలో ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసి మిగ‌తా వాళ్ల కోసం గాలిస్తున్నారు.

హైద‌రాబాద్ శివార్ల‌లో ప‌టాన్ చెరు స‌మీపంలోని బీరం గూడ ముత్తూట్ పైనాన్స్ కార్యాల‌యంలో డిసెంబ‌ర్ 28న ఐదుగురు దుండ‌గులు భారీగా దోపిడీకి పాల్ప‌డ్డారు. సీబీఐ అధికారుల‌మంటూ లోపలికి వెళ్లి హ‌డావుడి చేశారు. 40 కిలోల బంగారం, ల‌క్ష రూపాయ‌ల డ‌బ్బు తీసుకుని ఉడాయించారు. అర‌గంట‌లోపే దోపిడీ పూర్తి చేశారు. సిబ్బందిని బాత్ రూంలో బంధించి స్కార్పియో కారులో పారిపోయారు.

అప్ప‌టి నుంచి ప్ర‌త్యేక పోలీస్ బృందాలు దొంగ‌ల కోసం గాలిస్తున్నాయి. సీసీటీవీల ఫుటేజీ ఆధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగింది. చివ‌ర‌కు ముంబైలో ఇద్ద‌రు నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. ఈ దొంగ‌లంద‌రూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు. వీరికి ముంబై జైల్లో ప‌రిచ‌యం అయింది. స‌ర్దార్జీ సూత్ర‌ధారిగా ముఠా క‌ట్టారు. బంగారం త‌న‌ఖా పెట్టుకునే ఫైనాన్స్ కంపెనీలో సీబీఐ పేరుతో వెళ్లి బెదిరించి దోపిడీ చేయాల‌ని ప్లాన్ చేశారు. క‌ర్ణాట‌క లోని వాడీ కేంద్రంగా అన్నీ స‌మ‌కూర్చుకున్నారు. అక్క‌డే డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక స్పార్పియో, ఒక టూవీల‌ర్ లో హైద‌రాబాద్ వ‌చ్చారు.

డిసెంబ‌ర్ 23, 24, 26తేదీల్లో మూడుసార్లు రెక్కీ జ‌రిపారు. ఫైనాన్స్ ప‌రిస‌రాలు అణువ‌ణులూ గ‌మ‌నించారు. ఎటు నుంచి లోప‌లికి వెళ్లాలి, త‌ర్వాత ఎటు నుంచి సుల‌భంగా పారిపోవ‌చ్చ‌నే దానిపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించేలా దోపిడీ చేశారు. స్కార్పియో నెంబ‌ర్ ప్లేటును మూడుసార్లు మార్చారు. అంతా ప‌క్కాగా ప్లాన్ చేశారు. అయినా పోలీసుల‌కు మ‌రింత ప‌క్కా స‌మాచారం అంద‌డ‌టంతో ఇద్ద‌రు ప‌ట్టుబ‌డ్డారు. మ‌రో ముగ్గురు దొంగ‌లు, కారు డ్రైవ‌ర్ కోసం గాలిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close