ఇక మీడియాలో అదానీ టేకోవర్లు ! ఆ చానల్‌ డీల్ ఫైనల్..?

మైనింగ్, పోర్టులు, ఎయిర్ పోర్టులను టేకోవర్లు చేసేస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు మీడియాపై దృష్టి పెట్టింది. మీడియాలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం మీడియా రంగంలో ప్రసిద్ధుడైన .., ప్రస్తుతం ద క్వింట్ గ్రూప్‌లో ఉన్న సంజయ్ పుగాలియాను ఎడిటర్ ఇన్ చీఫ్‌గా నియమించుకుంది. ఇలా నియామకం జరగిన మూడు నాలుగు రోజుల్లోనే ఓ ఇంగ్లిష్, హిందీ భాషల్లో సుప్రసిద్ధ చానల్‌ను ఆయన టేకోవర్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

దేశంలో బీజేపీ, అదానీ తమకు వ్యతిరేకంగా భావించే చానల్ అది. ఆ మీడియా గ్రూప్‌పై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. మనీలాండరింగ్‌తో అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం లాంటి కేసులు కూడా ఉన్నాయి. ఆ చానల్‌పై దృష్టి పెట్టిన అదానీ కేసుల నుంచి విముక్తితో పాటు పెద్ద మొత్తంలో నగదును ఆఫర్ చేసి ఆ చానల్‌ను కొనుగోలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రూ. పదహారు వందల కోట్లకు డీల్ జరిగిపోయిందని.. లండన్‌లో ఈ ఒప్పందానికి సంబంధించి పత్రాలపై సంతకాలు జరగబోతున్నాయని చెబుతున్నారు.

అదానీ గ్రూప్ పెట్టుబడుల వ్యవహారంపై ఇప్పటికే దుమారం ఉంది. ఆయనకు పెట్టుబడులకు కావాల్సిన నగదు ఎక్కడి నుంచి వస్తుందన్నదానిపై స్పష్టత లేదు. విదేశీ కంపెనీల నుంచి వస్తున్న పెట్టుబడులకు లెక్కలు లేవని.. ఆ కంపెనీలకు ఆడ్రస్‌లు కూడా లేవన్న ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. అయితే అదానీ మాత్రం పెట్టుబడులు పెడుతూ పోతున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటి వరకూ ఏ ఒక్క సంస్థనీ కింద నుంచి పెంచింది లేదు. ఎవరో పెంచిన వారిని కొనుగోలు చేయడమే చేస్తూ వస్తోంది. మీడియాలోనూ అదే చేయబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close