రజనీని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్చాలట !!

సూపర్ స్టార్ అని కోట్లాది మంది అభిమానులు వేలం వెర్రిగా రజనీకాంత్ సినిమాలు చూస్తారు. ఆయన్ని దేవుడిలా ఆరాధిస్తారు. ఆయన సినిమా వస్తే పండుగ చేసుకుంటారు. కబాలి సినిమా విషయంలో అదే జరిగింది. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇంత జరిగినా… ఓ వ్యక్తి మాత్రం, రజనీకాంత్ తో ఈ సినిమాలో చేయించిన విన్యాసాలు తనకు జుగుప్స కలిగించాయంటూ పోలీసులకు పిర్యాదు చేశాడు.

అదేదో వేరే ఊళ్లో కాదు. రజనీకి దాదాపు అందరూ అభిమానులే అని భావించే చెన్నైలోనే ఈ సంఘన జరిగింది. వడపళని కి చెందిన కందస్వామి అనే 66 ఏళ్ల వ్యక్తి రజనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబాలి సినిమా హైప్, ప్రచారానికి మోసపోయాననేది అతడి ఫిర్యాదు సారాంశం. మీడియాలో విపరీతంగా హైప్ చేయడం వల్ల తాను 1200 రూపాయలకు పెట్టి చెన్నైలో సినిమా చూశానన్నాడు. తీరా ఆ సినిమా దారుణంగా ఉందట.

ఇంచుమించు తన వయసున్న రజనీకాంత్ అనే వృద్ధుడి చేత ఈ సినిమాలో విచిత్రమైన విన్యాసాలు చేయించారని అవి చూసి తనకు జుగుప్స కలిగిందని పేర్కొన్నాడు. రజనీ కాంత్ వయసు 65 ఏళ్లు. రజనీకాంత్ తో పాటు ఆ సినిమా దర్శక నిర్మాతలు తనను మోసం చేశాడని ఆరోపించాడు. ప్రజల కోసం తమిళనాడు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా, రజనీని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించి పుణ్యం కట్టుకోండని కోరుతున్నాడు.

తనలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ రజనీ సినిమాలను చూసి మోసపోవద్దంటే అతడికి ఓల్డ్ ఏజ్ హోంలో శాశ్వతంగా ఉంచడమే మార్గమంటున్నాడు కందస్వామి. వృద్ధుడైన రజనీచేత విచిత్రమైన ఫైట్లు, ఫీట్లు చేయించడం జుగుప్సాకరంగా ఉందనే అతడి వ్యాఖ్యకు చాలా మంది ఆశ్చర్యపోయారు. అతడి వాదన కరెక్ట్ అనే వారూ ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close