దేశ ప్రజలందరికీ అద్వానీ ఒక మంచి సలహా

బీజేపీ కురువృద్దుడు లాల్ కృష్ణ అద్వానీ అవకాశం చిక్కినపుడల్లా ప్రధాని నరేంద్ర మోడికి చురకలు వేస్తూనే ఉంటారు. కానీ ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన మోడీకి చిన్న చురక వేస్తూనే మళ్ళీ మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా వెనకేసుకు వచ్చేరు.

ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా డిల్లీలో తన నివాసంలో మువ్వన్నెల జెండా ఎగురవేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మనం బ్రిటిష్ వారితో అనేక ఏళ్లపాటు పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకొన్నాము. కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే దేశంలో భావస్వేచ్చకు భంగం కలిగిపోతోందని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ మా ప్రభుత్వం వలననే మన భావ స్వేచ్చకు భంగం కలుగుతున్నట్లయితే అప్పుడు తప్పకుండా అందరూ కలిసి గట్టిగా పోరాడుతారు. కానీ దేశంలో ఎక్కడా అటువంటి పరిస్థితి లేదు. దేశంలో ఏదో అనర్ధం జరిగిపోతోందనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు,” అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా అమిత్ షా మళ్ళీ ఎన్నికయిన తరువాత ఆయనింటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోన్నందున బహుశః కొంచెం ప్రసన్నం అయ్యేరేమో?

అద్వానీ దేశ ప్రజలందరికీ ఈ రోజు ఒక మంచి సందేశం ఇచ్చేరు. “సాధారణంగా ఆగస్ట్ 15, గణతంత్రదినం వంటి రోజులలో దేశ ప్రజలలో దేశభక్తి పొంగిపొరలుతుంటుంది. అది చాలా సహజమే. కానీ అటువంటి భావన నిత్యం వారి చేతలలో కనిపించాలి. ప్రస్తుతం విద్య మరియు క్రీడా రంగాలలో అది చాలా ప్రస్పుటంగా కనబడుతోంది. మిగిలిన అన్ని రంగాలలో కూడా జాతీయ భావన, దేశభక్తిని కలిగి ఉండాలి. దేశ ప్రజలు అందరూ ఎల్లప్పుడూ కూడా జాతీయ భావన కలిగి ఉండాలి,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close