మళ్లీ “యాంటీ” సమైక్య సెంటిమెంట్ రాజేసిన కెసిఆర్

కెసిఆర్ ప్రగతి నివేదన సభ ముగిసింది. ముందస్తు ఎన్నికల గురించో, కొత్త సంక్షేమ పథకాల గురించో మాట్లాడుతాడు అనుకుంటే, కెసిఆర్ వాటి గురించి మాట్లాడకుండా నాలుగేళ్ల ప్రగతిని ప్రజలకు వివరించడానికి పరిమితమయ్యాడు. అయితే దానితోపాటు చాకచక్యంగా మరొకసారి ‘యాంటీ ‘ సమైక్య సెంటిమెంట్ ను రాజేసాడు కెసిఆర్.

అసలు ప్రసంగం మొదలు పెట్టడమే సమైక్య నాయకుల కరెంటు చార్జీల బాదుడు అంటూ మొదలు పెట్టాడు కేసీఆర్. అక్కడితో ఆగలేదు, సమైక్య అహంకారులు, సమైక్య దొరలు, ఇలాంటి పదాలు ఎక్కడికక్కడ ప్రయోగిస్తూ సమైక్యవాదుల మీద మరొకసారి వ్యతిరేకత కనపరుస్తూ ప్రజల్లో కూడా ఉద్యమ కాలం నాటి ఈ యాంటీ సమైక్య సెంటిమెంటును మరొకసారి తట్టి లేపాడు.

అటుపక్క ఢిల్లీకి గులాం కావద్దు అని చెబుతూ -కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నిర్ణయాధికారాలు తెలంగాణలో ఉండవని కాంగ్రెస్ హై కమాండ్ ఢిల్లీ నుంచి అన్నీ నిర్ణయిస్తుందని సంకేతాలు పంపి, కాంగ్రెస్ అవకాశాల కు గండి కొట్టడానికి ప్రయత్నించిన కెసిఆర్, సమైక్య అహంకారులు అని చెప్పడం, సమైక్యవాదుల కాలంలో కరెంటు చార్జీలు పెంచడం అంటూ పరోక్షంగా చంద్రబాబు పాలనను ప్రస్తావించడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ పొత్తు ల ద్వారా మళ్లీ తెలంగాణలో బలపడే యత్నాలను కూడా ఆదిలోనే తుంచడానికి చేసిన ప్రయత్నం లాగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close