అభిమానుల‌కు అఖిల్ విన్న‌పం

టాలీవుడ్‌లో హీరోలే దేవుళ్లు. ఓ క‌థానాయ‌కుడ్ని అభిమానించారంటే.. . అభిమానులు నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. వాళ్ల అభిమానాన్ని ర‌క‌ర‌కాల రూపాల్లో చూపిస్తారు. అఖిల్ కోసం ముగ్గురు అభిమానులు కూడా అదే చేశారు. విజ‌య‌వాడ నుంచి తిరుప‌తి వ‌ర‌కూ కాలి న‌డ‌కన వెళ్లారు. ఈ విష‌యం అఖిల్ కీ తెలిసింది. అందుకే `మిస్ట‌ర్ మ‌జ్ను` ప్రీ రిలీజ్ వేడుక‌లో… త‌న అభిమానుల‌కు ఓ సందేశం అందించాదు.

”ఈమ‌ధ్య ఓ విష‌యం తెలుసుకున్నాను. రెడ్డి అనే ఓ అభిమాని మ‌రో ఇద్దరితో క‌లిసి విజ‌య‌వాడ నుంచి తిరుప‌తి 450 కిలో మీట‌ర్లు కాలిన‌డ‌క‌న వెళ్లార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే నా కంట్లోంచి నీళ్లొచ్చాయి. ఇదంతా అవ‌స‌రం లేదు. మీ అభిమానం మాతో ఉంది. అది చాలు. ఇలాంటి సాహ‌సాలు చేయ‌కండి. మీ కుటుంబ స‌భ్యులు మీపై చాలా ఆశ‌లు పెట్టుకుంటారు. వాళ్లంతా బాధ‌ప‌డుతుంటారు. ఇంకెప్పుడూ ఇలాంటి సాహ‌సాలు చేయ‌కండి” అని అభిమానుల్ని కోరాడు అఖిల్‌.

ఇదే వేదిక‌పై ఎన్టీఆర్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. త‌న‌ని ప్రేమ‌గా టైట‌ర్ అని పిలుస్తాన‌ని, త‌న ఎన‌ర్జీని ఎవ్వ‌రూ మ్యాచ్ చేయ‌లేర‌ని కితాబు ఇచ్చాడు. ”తార‌క్ గారూ… అంటే త‌ట్టుకోలేడు. ఏట్రా బ‌లిసిందా.. ఫార్మ‌ల్‌గా అయిపోతున్నావు అని అడుగుతాడు. క‌లిసిన నిమిషంలో కుటుంబ స‌భ్యుడిలా చూసేసుకుంటాడు. ట్విట్ట‌ర్‌లో థ్యాంక్స్ అని పెడితే.. అలా పెట్ట‌కు, అది నా బాధ్య‌త అన్నాడు” అంటూ ఎన్టీఆర్ పై ప్రేమ కురిపించాడు అఖిల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close