యూపీలో సంచలనం, కొడుకునే బహిష్కరించిన ములాయం

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలో సమాజ్ వాదీ పార్టీ నిలువునా చీలిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, తన తనయుడు అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు ములాయం సింగ్ యాదవ్. దీంతో అధికార పార్టీ నిలువునా చీలిపోయింది.

మొన్నటి వరకు బాబాయి అబ్బాయి మధ్య జరిగిన యుద్ధం చివరకు తండ్రీ తనయుల పోరాటంగా మారింది. ఇప్పుడు అసలైన పార్టీ ఎవరిది అనేది తేలాల్సి ఉంది. అఖిలేష్ రాజీనామా చెసేది లెదని ఆయన మరొ బాబాయి రాం గొపాల్ యాదవ్ తేల్చి చెప్పారు. అఖిలెష్ తో పాటు ఆయన్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించారు.

కొత్త ముఖ్యమంత్రిని తానే నిర్ణయిస్తానని ములాయం ప్రకటించారు. దీంతో అఖిలేష్ పదవి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. మెజారిటీ ఎం ఎల్ ఎ లు ఆయనకు మద్దతు తెలిపితే పదవిలో కొనసాగుతారు. లేకపోతే పదవిని కోల్పోక తప్పదు.

శనివారం ఉదయం అఖిలెష్ తన వర్గం ఎం ఎల్ ఎ లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఎంతమంది హాజరవుతారు అనేది కీలకం. మెజారిటీ కి అవసరం అయినంత మంది హాజరైతె ఆయన గట్టెక్కినట్టే. అప్పుడు ములాయం తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ కావచ్చు.

అలాగే పార్తీ ఎం పి లలో ఎక్కువ బంది ఎవరి వైపు ఉన్నారనేది కూడా ముఖ్యమే. ప్రస్తుత పరిస్థితుల్లో అఖిలేష్ బలంగా కనిపిస్తున్నారని కొందరు పరిశీలకుల అభిప్రాయం. అదే నిజమయితే అప్పుదు ములాయం ప్రాభవం తగ్గవచ్చు. తమ్ముడి ఈగో కోసం తనయుడినే బహిష్కరించినందుకు మూల్యం చెల్లిస్తారా లేక పంతం నెగ్గించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close