నాగార్జున పై ఓ రూమర్ చక్కర్లు కొడుతొంది. బాహుబలి 2 తో నాగ్ పంపిణీ రంగంలో అడుగుపెడుతున్నారని, కృష్ణ జిల్లా హక్కులని ఆయన, మరో నిర్మాత సాయి కొర్రపాటి తో కలసి రూ. 8 కోట్లతో కైవసం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఐతే అవన్నీ అవాస్తవాలని తేల్చేశారు నాగ్. బాహుబలి 2 హక్కులని కొనలేదని, అసలు ఆ ఆలోచనే రాలేదని, పంపిణీ రంగంలో అడుగుపెట్టే ఉద్దేశ్యమే ఎప్పుడూ లేదని చెబుతున్నాడు నాగ్.
ఐతే మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి తప్పుకుంటున్నట్టు నాగ్ ధృవీకరించాడు.ఆ కార్యక్రమాన్ని ఇక ముందు తన స్థానం లో చిరంజీవి నడిపిస్తారని, చిరు రాకతో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి మరింత క్రేజ్ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు నాగ్. నాగ్ చేతులో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా వుంది. అదే.. ఓం నమో వెంకటేశాయ. తన ద్రుష్టి అఖిల్, చైతూ సినిమాలపై ఉందని.. వాళ్ళకి ఓ హిట్ ఇచ్చే బాధ్యత తానూ స్వీకరించానని చెప్పుకొచ్చాడు నాగ్.