ఎన్నికల్లో పోటీపై ఆశలు పెంచుకుంటున్న అలీ !

సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు .. ఎక్కడెక్కడ పోటీ చేయాలో ఓ క్లారిటీకి వచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేని వాళ్లకు సలహాదారు పదవులు ఇతర పదవులు ఇచ్చారు. అలా పదవులు పొందిన వారిలో అలీ కూడా ఉన్నారు. అయితే తనకు జగన్ టిక్కెట్ ఇస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. రాజమండ్రిపై ఆశలు పెట్టుకుని ఆయన ఆ నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నారు. చిన్న చిన్న ఈవెంట్లకు ఎవరు పిలిచినా వెల్తున్నారు. ఓ చిన్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడానికి రాజమండ్రి వెళ్లిన అలీ.. అక్కడ మీడియాతో తనకు టిక్కెట్ ఇస్తారని మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారు.

మా నాయకుడు ఎక్కడ నుంచి ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.. ఎక్కడ పోటీ చేస్తాం అనే దానిపై పుకార్లు అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు. రాజమండ్రి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే తాను సిద్ధమని ఆఫ్ ది రికార్డుగా ఆయన చెబుతున్నారు. అయితే ఎంపీ స్థానానికి ఖర్చు పెట్టాలంటే.. అలీకి చేతులు రావని ఆయన గురించి తెలిసిన వాళ్లు చెబుతూంటారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు కూడా సిద్ధమంటూ తిరుపతిలో వ్యాఖ్యానించారు. ఇలా ఎక్కడ మైక్ కనిపించినా తన కోరిక వెల్లడిస్తున్నారు.

మొత్తంగా ఆలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అలీ కోరికను జగన్మోహన్ రెడ్డి తీరుస్తారో లేదో స్పష్టత లేదు. ఇప్పటికే.. నియోజకవర్గాల్లో చాలా మందికి పని చేసుకోమని చెప్పారు. అలా అలీకి ఏమీ చెప్పకపోవడంతో ఆయన ఎక్కడా ఇంకా ఎన్నికల పని ప్రారంభించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close