ఏపీలో అన్ని పార్టీలదీ ఒంటరిపోరే..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కలుస్తున్నట్లే ఉన్నారు కానీ.. ఎవరూ కలవడం లేదు. రాజకీయ పార్టీలు రెండు రకాలుగా విడిపోయాయి. ఓ వైపు కొన్ని.. మరో వైపు మరికొన్ని పార్టీలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కానీ.. ఎవరూ కలవడానికి.. కలసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడటం లేదు. ప్రత్యేకహోదా కోసం.. అంటూ టీడీపీ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. అయితే అది జాతీయ స్థాయిలో మాత్రమే. కూటమిగా తెలంగాణలో పోటీచేసినా సరైన ఫలితాలు రాలేదు. తెలంగాణ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చి ఉండి ఉంటే.. పరిస్థితులు ఎలా ఉండేవో కానీ.. ఇప్పుడు మాత్రం.. కాంగ్రెస్ పార్టీతో ఏపీలో సీట్ల సర్దుబాటు లేదా పొత్తు అనే ప్రస్తావన వచ్చే అవకాశం లేదు. చంద్రబాబు కూడా.. జాతీయ స్థాయి వరకూ ఆలోచిస్తున్నారు కానీ.. దాన్ని ఏపీ వరకూ తీసుకు
రాదల్చుకోలేదని..టీడీపీ నేతలు అంటున్నారు. అంటే.. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడం ఖాయమే.

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరి పోరేనన్న చర్చ ప్రారంభమయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఇప్పటికే. ఈ అంశంపై దృష్టి సారించారు. ఏపీ కాంగ్రెస్ నేతలందర్నీ.. నెలాఖరులో ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే .. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి.. జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. ఆ అభిప్రాయాలను రాహుల్ గాంధీకి ఇవ్వనున్నారు. అదే సమయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒంటరిగా పోటీ చేయడం ఖాయమే. సహజంగానే ఆయన తీరు .. ఇతర పార్టీలను దగ్గర చేసుకునేలా ఉండదు. అనివార్యంగా బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాల్సి వస్తోంది. అవసరం లేనప్పుడు వదిలించుకుంటారు. కానీ ఇప్పుడు వదిలించుకోలేరు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి ఎదురెళ్లలేని పరిస్థితుల కారణంగా.. సుడి గుండంలో వైసీపీ చిక్కుకుపోయింది. అలాగే జనసేన పార్టీతోనూ… జగన్ కు పొసిగే అవకాశం లేదు. చర్చలు జరిగాయని ప్రచారం జరిగినా… ఇద్దరి మధ్య.. సీఎం పీఠం పెద్ద పజిల్‌గా మిగిలిపోతుంది కాబట్టి.. కలిసే అవకాశమే లేదు.

ఇక జనసేన వైసీపీతో కలవదు. మరి ఎవరితో కలుస్తుందనేది అస్పష్టంగా ఉంది. టీడీపీతో పొత్తులు పెట్టుకుంటారన్న అంచనాతో.. జగన్.. కమ్యూనిస్టుల్ని దూరం పెడుతున్నారు. కానీ.. ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి.. చంద్రబాబు వారితో ఎలాంటి పొత్తులు పెట్టుకునే అవకాశం లేదని తేలినప్పుడు… జనసేన వామపక్షాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే.. జనసేనకు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. కొన్ని సీట్లను.. వామపక్షాలకు ఇచ్చినా… ఒత్తిడి తగ్గుతుందనే ఆలోచన చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అంటే .. వామపక్షాలు మినహా.. మరే పార్టీ కూడా.. ఏపీలో కలసి పోటీ చేయడానికి సిద్ధంగా లేవని చెప్పుకోవచ్చు. విపక్షాల ఓట్లన్నీ ఏకమయ్యే పరిస్థితి కూడా లేదు. ఇది ఎవరికి లాభం చేకూరుస్తుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close