తమిళ్లో మంచి హిట్ సినిమాలే అందించాడు లింగుస్వామి. ఆవారా లాంటి క్లాసిక్ హిట్తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. కానీ తెలుగులో ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలన్న ఆయన కోరిక మాత్రం ఒక పట్టాన పట్టాలెక్కలేదు. మహేష్బాబుకి కథ చెప్పాడు. సెట్ కాలేదు. ఎన్టీఆర్ని కూడా కలిశాడు. కానీ కమిట్ చేయించలేకపోయాడు. అయితే మొదటి నుంచీ కూడా చాలా ఎక్కువ సార్లు కలిసింది మాత్రం అల్లు అర్జున్నే. ఆ ప్రయత్నాలన్నీ వర్కవుట్ అయ్యి ఫైనల్గా బన్నీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘డిజె’ సినిమాలో యాక్ట్ చేస్తున్న ఆ తర్వాత లింగుస్వామి డైరెక్షన్లో యాక్ట్ చేయనున్నాడు. తెలుగు, తమిళ్ భాషలో భారీగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఙానవేల్ రాజా నిర్మించనున్నాడు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ డిటెయిల్స్, ప్రొడక్షన్ డిటెయిల్స్ తెలియచేయనున్నారు.