అల్లు అర్జున్ చేతుల మీదుగా 31న ‘కుమారి 21ఎఫ్’ పాటలు!

రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. సుకుమార్ రైటింగ్స్, పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. చిత్ర గీతాల్ని ఈ నెల 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటలు ప్రముఖ యువ కథానాయకుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ‘ సుకుమార్ మార్క్ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిది. తనను ప్రేమించడానికి పేరు, వయసుతో తప్ప ఆస్తిపాస్తులు, కుటుంబ నేపథ్యంతో పనిలేదని విశ్వసించే ఓ అమ్మాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆమె అభిప్రాయాలకు విలువనిచ్చే ప్రేమికుడు దొరికాడా?లేదా? అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిస్తున్న విలక్షణ ప్రేమకథా చిత్రమిది. సుకుమార్ అందించిన కథ, కథనాలతో పాటు సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రత్నవేలు ఛాయాగ్రహణం సినిమాకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. ఇటీవలే విడుదల చేసిన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభిస్తోంది. దేవిశ్రీప్రసాద్ వినసొంపైనా బాణీలనిచ్చారు. ఈ నెల 31న అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ చిత్ర గీతాల్ని విడుదల చేస్తున్నాం. కొత్తదనాన్ని నమ్మి చేస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close