తుని విద్వంసానికి పాల్పడిన వారిని ఉపేక్షించాలా?

కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తునిలో బారీ విద్వంసం జరిగిన వెంటనే అది వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అతను తన రాజకీయ ప్రయోజనాల కోసం వెనుక నుండి కాపులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దానికి జగన్ తో సహా వైకాపా నేతలు చాలా మంది ధీటుగా జవాబులు ఇస్తూనే ఉన్నారు. పనిలోపనిగా కాపులను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అంబటి రాంబాబు కాపులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటమే కాకుండా, తెదేపాపై ఎదురుదాడి కూడా చేసారు. ఆ విషయం ఆయన మాటలలో స్పష్టంగా కనబడుతోంది.

ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఉదృతంగా సాగుతున్న కాపుల ఉద్యమాన్ని చీల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా చవకబారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభాన్ని పక్కనపెట్టి, వేరే కాపు నేతలు కొందరితో ఆయన సమావేశమవడం అదే సూచిస్తోంది. కాపులకు, బీసీలకు మద్య చిచ్చు పెట్టడానికే ఆర్. కృష్ణయ్యను ముందుకు తీసుకువచ్చేరు. సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెపుతూనే మళ్ళీ ఈ ఉద్యమంలో పాల్గొన్న 27మంది కాపు నేతలపై కేసులు నమోదు చేయడాన్ని ఏమని భావించాలి? తుని సంఘటనలకు రాయలసీమ, కడప జిల్లాల నుండి వచ్చిన వైకాపా గూండాలే కారణమని తెదేపా ఆరోపిస్తోంది. కానీ తుళ్ళూరులో పంటలు తగులబెట్టిన తెదేపా గూండాలే తునిలో కూడా విద్వంసం సృష్టించారని మాకు అనుమానాలున్నాయి.” అని అంబటి రాంబాబు ఆరోపించారు.

ముద్రగడ పద్మనాభం, కన్నా లక్ష్మి నారాయణ, అంబటి రాంబాబు వంటి కొంతమంది నేతలు కాపు గర్జనకు హాజరయిన వారిలో ఎవరూ విద్వంసం సృష్టించలేదని కనుక వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం అక్రమం, అన్యాయం అని ఆరోపిస్తున్నారు. అసలు ఇటువంటి సంఘ విద్రోహక చర్యలకు ప్రజలను ప్రోత్సహించడం, పాల్పడటాన్ని అందరూ ఖండించాలి. దీనికి కారకులు ఎవరయినా సరే వారిని కటినంగా శిక్షించాలని కోరవలసిన రాజకీయ నేతలు, వారిని ఉపేక్షించాలని కోరుతుండటం విస్మయం కలిగిస్తోంది. అందుకోసం వారు చాలా తెలివిగా ఆ విద్వంసం సృష్టించింది తెదేపా గూండాలేనని వాదించడం ఇంకా విస్మయం కలిగిస్తోంది. అంబటి రాంబాబు మాటలలో అది స్పష్టంగా కనబడుతోంది.

ఒకవేళ తెదేపా గూండాలే ఆపని చేసి ఉన్నట్లు నమ్ముతున్నట్లయితే, వైకాపా నేతలు సదరు అనుమానితుల వివరాలను పోలీసులకు తెలియజేసి వారి దర్యాప్తుకు సహకరించకుండా, వారి దర్యాప్తుకు ఆటంకం కలిగేలా, పోలీసులపై ఒత్తిడి తెచ్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అనే సందేహం కలుగుతుంది. ఈ విద్వంసం వెనుక తమ ప్రమేయం లేదని నమ్ముతున్నట్లయితే రాజకీయ నాయకులు ఆ విషయాన్ని పోలీసులకే వదిలిపెడితే బాగుంటుంది. అప్పుడు పోలీసుల దర్యాప్తులో ఆరోజు జరిగిన ఘటనలు ఎవరు బాధ్యులో తేలుతుంది. కానీ పోలీసులు దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తుంటే వైకాపా నేతలు అన్యాయం, అక్రమం అని వాదిస్తుంటే వారినే అనుమానించవలసి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close