వైకాపా విమర్శలకి తెదేపా మౌనమే సమాధానం!

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని కోరుతూ వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో మూడవ రోజుకి చేరుకొంది. ఉత్తరాంధ్రా జిల్లాల వైకాపా నేతలు, అంబటి రాంబాబు, సుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలందరూ వచ్చి ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు.

అమర్నాథ్ కి సంఘీభావం తెలపడానికి వచ్చిన అంబటి రాంబాబు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటుగా విమర్శలు చేసారు. “రైల్వే జోనే సాధించలేని ముఖ్యమంత్రి ఇంక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమి సాధించగలరని ఎద్దేవా చేసారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చనందుకు హోదా ఇవ్వలేకపోతున్నామని చెపుతున్న కేంద్రప్రభుత్వం, రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో, ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెట్టిన్నప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి ఎందుకు అడగడం లేదు అని ప్రశ్నించారు. రైల్వే జోన్ గురించి తెదేపా కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదని విమర్శించారు. తెదేపా-భాజపాలు రెండూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు.

వైకాపా ఎంపి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ “తెదేపా ప్రభుత్వం, దాని ఎంపిలు మాట్లాడకపోయినా తాము ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర మంత్రులను కలిసి అడిగినా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అయినప్పటికీ రైల్వే జోన్ ఏర్పాటు చేసేవరకు తాము పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పారు.

సాధారణంగా వైకాపా నేతలు చేసే ప్రతీ విమర్శకి వెంటనే స్పందించే తెదేపా నేతలు, మంత్రులు ఈ దీక్ష గురించి కానీ, ఆ సందర్భంగా వైకాపా నేతలు తమపై చేస్తున్న విమర్శలపై గానీ ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. ఇది కూడా ప్రజల మనోభావాలతో ముదిపడున్న సున్నితమయిన అంశమే కనుక ఈ విషయంలో తెదేపా నేతలు సంయమనం పాటిస్తున్నట్లున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొన్నప్పుడు కూడా తెదేపా ఇదేవిధంగా వ్యహరించింది. కనుక అమర్నాథ్ దీక్షకి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ముగింపే ఇవ్వవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close