అమిత్‌ షా అతి విశ్వాసం..

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలపై బిజెపి అద్యక్షుడు అమిత్‌షా అతి విశ్వాసంతో వున్నారు. 180 స్థానాలున్న ఆ రాష్ట్ర శాసనసభలో తమ పార్టీకి 150 పైన రావడం అసాధ్యం గానీ అత్యాశ కాదని అంటున్నారు. వాస్తవానికి 165 వస్తాయని ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. ప్రధాని మోడీ హయాంలో అక్కడ జరిగిన అభివృద్ధి వల్లనే ఇంత మద్దతు పెరిగిందని ఆయన చెబుతున్నారు. కోటిమందికిపైగా పార్టీ సభ్యులుంటే ఏడు లక్షల మందికి పైగా గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అందులోనూ ఓటర్ల జాబితాలపై పనిచేసే పన్నాప్రముఖ్‌ల ప్రాధాన్యత చాలా ఎక్కువంటున్నారు. గుజరాత్‌లో తమ విజయం ప్రభావం కర్ణాటకపైన తర్వాత రాజస్థాన్‌ మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలపైన తప్పక పడుతుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌కు హార్దిక్‌ పటేల్‌ వంటివారి మద్దతు వల్ల పెద్ద ప్రయోజనం లేదనీ గుజరాత్‌ మళ్లీ కుల రాజకీయాల కాలానికి తిరిగివెళ్లడం జరగదని అమిత్‌ షా చెబుతున్నారు. చాలా రోజులుగా ఆయన గుజరాత్‌లోనే మకాం వేశారు. ఈ వారం ప్రధాని ఇరవై ఎన్నికల సభల్లో మాట్లాడతారట. ఇక అరుణ్‌జైట్లీ, సృతి ఇరానీ వంటి కేంద్ర మంత్రులు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. బిజెపికి దగ్గరగా వుండే సీనియర్‌ పాత్రికేయుడు స్వపన్‌దాస్‌గుప్తా ఎన్నికల గురించి రాస్తూ గుజరాత్‌లో ఆ పార్టీ బలం తగ్గుతుందని మీడియాలో వస్తున్నది క్షేత్ర స్థాయి అనుభవంలేని పైపై పరిశీలకులేనని తోసిపుచ్చారు. కాని కొంతమంది ఇతర వ్యాఖ్యాతలు మాత్రం బిజెపి విజయం నల్లేరు మీద బండి కాబోదని జోస్యం చెబుతున్నారు. నిజంగా ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close