తెలంగాణ బీజేపీ నేతల్లా పని చేయాలంటున్న షా !

తెలంగాణ బీజేపీ నేతల పోరాటం అమిత్ షాను బాగా ఆకట్టుకుంటోంది. ఇతర రాష్ట్రాల వారికీ ఉదాహరణగా చూపిస్తున్నారు. తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పని చేయాలని అమిత్ షా ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. బీహార్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను అమిత్ షా పలుమార్లు ప్రస్తావించారు. ఆయన చేస్తున్న పాదయాత్రలు, యాత్రలను గురించి వివరించారు.

వారు చేస్తున్నట్లుగానే మోర్చా నాయకులు చేస్తే బీజేపీ గెలుపు కచ్చితంగా సాధ్యం అవుతుందని అన్నారు పార్టీలో పైపదవుల్లో ఉన్న వాళ్లు గుర్తించి మెచ్చుకుంటే.. పార్టీ శ్రేణులు మరింత కష్టపడతారని అందుకే మోదీ అలా పొగిడారని అనుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ ఎంపీలు నియోజక వర్గాల్లోకి వెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు అమిత్ షా తెలిపారు. సమావేశాల అనంతరం మూడు రోజులపాటు ఎంపీలు తమ తన నియోకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హైదరాబాద్‌లో నెల క్రితం జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు.

బండి సంజయ్ మూడో విడత పాతయాత్ర ప్రారంభిస్తున్నారు. గతంలోలా ఏ మాత్రం హంగామా తగ్గకుండా ఈ యాత్ర ఉండనుంది. అయితే ఎప్పుడూ చేరికల గురించి హడావుడి చేస్తూంటారు. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి చేరికల హడావుడి ఉండే చాన్స్ లేదు. పార్టీలో చేరేవారంతా.. ఢిల్లీ స్థాయి నేతలతోనే కండువా కప్పించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close