పోలవరంపై జగన్ విధానం ఫెయిరేనా..?

పోలవరం ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి. టీడీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పుడీ ప్రాజెక్ట్ నిర్మాణం ఒక్క సారిగా నెమ్మదించింది. అయితే.. కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే తమ లక్ష్యం అంటున్నారు. కావాలంటే ప్రాజెక్టును సందర్శిస్తానంటున్నారు. మరి నిధుల సంగతి ఎలా తేల్చుకుంటారు..!?

ప్రాజెక్ట్ వ్యయంపై కేంద్రం భరోసా కోసం జగన్ ఏం చేస్తారు..?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటి వరకు చురుగ్గా సాగింది. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. మరో ఏడాది పాటు ఇదే స్పీడు కొనసాగితే .. ప్రాజెక్టు నిర్మాణం దాదాపు ఒక కొలిక్కి వచ్చేసినట్లే. గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ ఏడాది ఎన్నికలు ముగిసే నాటికి దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత భిన్నాభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి. కాపర్ డ్యాంల పనులు ఆపేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ ఆర్ కే జైన్ అధికారులను ఆదేశించారు. దాంతో ఆ పనులకు బ్రేక్ పడింది. ఉభయగోదావరి జిల్లాలో ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మండలాల్లో ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేస్తేనే ప్రాజెక్టులో నీరు నిల్వ చేయడానికి సాధ్యమవుతుంది. ముంపు గ్రామాల వారికి పునరావాసం కింద ఇళ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. అవి పూర్తయితేనే వారు అక్కడ నుంచి బయటకు కదిలేది. మరి వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎప్పుడు అమలు చేస్తారనేది ఇంకా తేలలేదు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేస్తేనే ప్రాజెక్టులో నీటి నిల్వ..!

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. నిధుల కొరత ఉండడంతో … ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంశంపై కొత్త ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం కూడా నిధులు మంజూరు చేస్తేనే,ఈ ప్యాకేజీని అమలుచేయడం సాధ్యం అవుతుందని పోలవరం ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నిధులు ఎప్పుడు మంజూరు చేస్తుందో తెలీని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అప్పగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇలా అనేక చిక్కుముడులు ప్రస్తుతం ప్రాజెక్టు చుట్టూ అల్లుకున్నాయి.

పోలవరం అథారిటీ పదేపదే ఎందుకు కొర్రీలు పెడుతోంది..?

దానికి తోడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా ఇటీవల తరుచుగా క్షేత్ర స్దాయిలో సమీక్షలు చేస్తోంది. కొన్ని అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పిపీఏ సభ్యులు..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం పనులు సాగుతున్న తీరు పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై.. ప్రాజెక్ట్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఆర్థిక భారం అనిపిస్తే… ఏదో సాకు చెప్పి ఆపేయడానికి అవకాశం ఉంది. అలా జరిగితే.. మళ్లీ దాన్ని పట్టాలెక్కించడం అంత తేలిక కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close