ఆంధ్రప్రదేశ్ విభజన నేటితో సంపూర్ణం..! రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు..!

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దాదాపు నాలుగున్నరేళ్ల తర్వతా… వంద శాతం.. రెండు రాష్ట్రాలు విడిపోయిన రోజుగా… 2019 జనవరి ఒకటి నిలుస్తోంది. ఇంత వరకూ.. రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఉమ్మడిగానే ఉంది. ఈ రోజు నుంచి… ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం హైకోర్టులు ఏర్పడుతున్నాయి. ఇన్నాళ్లు హైకోర్టు విభజన వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సారి మాత్రం.. జరిగిపోయింది. తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారాలు చేయడంతో హైకోర్టులు ఏర్పడినట్లవుతుంది.

ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చేత.. గవర్నర్ నరసింహన్… హైదరాబాద్, విజయవాడల్లో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఏపీ హైకోర్టు భవనం ఇంకా రెడీ కాలేదు. విజయవాడలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలోనే కొన్నాళ్లపాటు హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందులో 9 కోర్టుహాళ్లు సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన న్యాయమూర్తులంతా సోమవారం సాయంత్రానికే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుకున్నారు. 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అన్ని కోర్టు హాళ్లు పని చేస్తాయి. 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు. ఈ సమయంలో వెకేషన్‌ కోర్టును నిర్వహిస్తారు. ఇందులో ఇద్దరు మాత్రమే న్యాయమూర్తులు ఉంటారు.

అధికారికంగా విభజన పూర్తయినా… రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మాత్రం ఇప్పుడల్లా పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పీట ముడి పడింది. వాటిని పరిష్కరించాల్సిన కేంద్రం.. సమస్యను మరింత జఠిలం చేస్తోంది కానీ.. రెండు రాష్ట్రాలకు అనుకూలమైన.. విభజన ఫార్ములాను సిద్దం చేయలేకపోతోంది. వివిధ రకాల కమిటీలు వేసి.. కాలయాపన చేస్తోంది. బయటకు ఓ రకంగా చెబుతూ.. కోర్టుల్లో మరో రకంగా అఫిడవిట్లు వేసి.. తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీ ఉంటేనే తమకు మంచిదన్నట్లుగా వ్యవహరిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close