అమిత్ షా మీదనే నిఘా పెట్టిన ఆంధ్రా ఎంపీ పీఎస్ !

అమిత్ షా ముంబై పర్యటనలో తాను కేంద్ర హోంఖ ఉన్నతాధికారనుంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేశారు. రెండు రోజుల పాటు ముంబయి పర్యటనకు వెళ్లారు. అక్కడ భాజపా నేతలతో సమావేశమయ్యారు. బుధవారం ఆ పర్యటన ముగిసింది. ఈ రెండు రోజుల పాటు ఆయన వెంటే కేంద్ర హోంశాఖ అధికారినంటూ ఆ వ్యక్తి కూడా తిరిగాడు. చివరికి అసలు ఆయనెవరో తెలియదని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకుని తీరా అసలు వివరాలు కనుక్కునేసరికి మైండ్ బ్లాంక్ అయింది. అతను ఓ ఆంధ్రా ఎంపీకి పర్సనల్ సెక్రటరీగా తేలింది. దీంతో సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారు.

ఆ వ్యక్తి పేరు హేమంత్ పవార్. తెలుగు వ్యక్తి కాదు. కానీ తెలుగు ఎంపీకి పీఎస్‌గా ఉన్నారు. వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంలో కనిపించాడు. అమిత్‌ షాకు దగ్గర్లోనే తిరిగాడు. భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేసి, ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. హేమంత్ పవార్‌పై ఐపీసీ 170, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అతను ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ అనుచరుడినని, వ్యక్తిగత కార్యదర్శినని అతను చెప్పుకొన్నట్లు తెలిపారు. అయితే ఆ ఎంపీ ఎవరనేది ఇంకా తెలియలేదు. తెలుగు ఎంపీలు ఇతర ప్రాంతాల వారిని పర్సనల్ సెక్రటరీలుగా పెట్టుకోవడం అరుదు. అయితే ఆంధ్రా నుంచి ఎంపీగా పరిమళ్ నత్వనీ ఉన్నారు ఆయన ఉండేది ముంబైలోనే. ఆయన పర్సనల్ సెక్రటరీ అయి ఉండవచ్చని కొన్నిఅనుమానాలు ఉన్నాయి. అయితే ఆయన .. తన పీఎస్‌ను అమిత్ షా టూర్‌లో హోంశాఖ ఉద్యోగిగా అనుకరిస్తూ ఉండాలని ఎందుకు పంపుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఆ ఎంపీ ఎవరు… హేమంత్ పవార్‌ను అమత్ షా టూర్‌లోకి చొచ్చుకు వచ్చేలా ఎందుకు చేశారన్నది ఇప్పుడు టాప్ ప్రయారిటీగా పోలీసులు వెలికి తీస్తున్నారు. ఈ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close