ఒడిషాకు తెలంగాణ ఆర్థిక సాయం ప్రకటించడం లేదా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అత్యంత ఔదార్యం ఉన్న సీఎం. ఆయన పక్క రాష్ట్రాలకు… కష్టం వస్తే ఎవరూ ఊహించనంత సాంయ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు హుదూద్ వచ్చినప్పుడు.. భూరి సాయం అందించారు. ఆ తర్వాత వరదల్లో కేరళ అతలాకుతలం అయినప్పుడు.. రూ. 25 కోట్లు ప్రకటించారు. వాటితో పాటు.. వివిధ రకాల సాయం కూడా అందించారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన ఒక్కో కుటుంబానికి.. రూ. కోటి చొప్పున సాయం ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కేసీఆర్.. ఉదారంగా చేసిన.. ఎన్నో సాయాలు మన కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఇప్పుడు… తుఫాన్ ఫొనిపై… కేసీఆర్… కానీ తెలంగాణ సర్కార్ కానీ.. అంటీముట్టనట్లుగా ఉంటోంది.

ఫోని తుఫాన్ కారణంగా.. ఒడిషాలో.. దాదాపు పది జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన పూరి జగన్నాధుని ఆలయం ఉన్న పూరి కూడా.. తీవ్రంగా నష్టపోయింది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం.. కొన్ని వేల మంది పని చేస్తున్నప్పటికీ.. ఇబ్బందికర పరిస్థితులు మారడం లేదు. ఏపీ ప్రభుత్వం.. పెద్ద ఎత్తున టార్పాలిన్లు.. ఇతర సహాయ సామాగ్రిని పంపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు…. రూ. 15కోట్ల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా.. కేసీఆర్ మాత్రం.. ఫోని తుపాన్ విషయంపై.. ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎలాంటి సాయం కూడా ప్రకటించలేదు.

నిజానికి.. ఒడిషా ముఖ్యమంత్రితో.. కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనను కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామిగా చేర్చేందుకు… కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఓ సారి ఒడిషా వెళ్లి చర్చలు జరిపారు కూడా. ఆ సమయంలో.. ఇద్దరికీ.. ఉమ్మడిగా… వ్యతిరేక ప్రాజెక్టు అయిన.. పోలవరంపై కూడా చర్చించారు. ముందు ముందు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా.. పట్నాయక్‌ను కలుపుకుని రాజకీయం చేయాలని… కేసీఆర్ అనుకుంటున్నారు. అయినప్పటికీ… ఫోని దెబ్బకు కుదేలైపోయిన ఒడిషాకు.. సాయం ప్రకటించే విషయంలో.. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close