ఫ‌ట్టుమ‌న్న మ‌రో తెలుగు క‌థ‌

బాలీవుడ్ వాళ్ల‌కు మ‌న తెలుగు క‌థ‌ల‌పై ఈమ‌ధ్య మ‌రింత‌గా మ‌మ‌కారం పెరిగింది. `అర్జున్ రెడ్డి`ని `క‌బీర్ సింగ్‌` గా ఆద‌రించారు, కోట్లు కురిపించారు. అందుకే తెలుగు క‌థ‌ల‌కు ఈస్థాయి గిరాకీ. ఇటీవ‌ల చాలా తెలుగు క‌థ‌లు బాలీవుడ్ కి వెళ్లాయి. వెళ్తున్నాయి. అయితే ఫ‌లితాల‌న్నీ `అర్జున్ రెడ్డి`లా ఎందుకుంటాయి..? వ‌రుస‌గా ఫ్లాపులు త‌గులుతున్నాయి. ఇటీవ‌ల `ప్ర‌స్థానం`, `కాంచ‌న‌` సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ అట్ట‌ర్‌ఫ్లాప్‌. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో సినిమా చేరిపోయింది. అదే.. `భాగ‌మ‌తి`.

అనుష్క ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం `భాగ‌మ‌తి`. అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ తెర‌కెక్కించింది. ఈ సినిమా హిందీలో `దుర్గామ‌తి`గా రీమేక్ చేశారు. అశోక్ నే ద‌ర్శ‌కుడు. ఈవార‌మే ఓటీటీ వేదిక‌గా విడుద‌లై.. ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. తెలుగునాట అనుష్క చేసిన మ్యాజిక్ బాలీవుడ్ లో భూమి ప‌ట్నాక‌ర్ చేయ‌లేక‌పోయింది. అనుష్క ఇమేజ్ `భాగ‌మ‌తి`కి ప్ల‌స్ అయ్యింది. బాలీవుడ్ లో భూమికి అంత ఇమేజ్ లేదు. పైగా… టేకింగ్ ప‌రంగా అశోక్ ఎలాంటి మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు. అందుకే… `దుర్గామ‌తి` తేలిపోయింది. ఈ ఫ్లాపుతో… బాలీవుడ్ గ‌డ్డ‌పై ప‌రాజ‌యం మూగ‌ట్టుకున్న తెలుగు ద‌ర్శ‌కుల జాబితాలో.. అశోక్ పేరు కూడా వెళ్లిపోయిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

సంయుక్త‌కు బాలీవుడ్ ఆఫర్‌

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌, విరూపాక్ష‌.... ఇలా తెలుగులో మంచి విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకొంది సంయుక్త మీన‌న్‌. ప్ర‌స్తుతం నిఖిల్, శ‌ర్వానంద్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సౌత్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల‌పై...

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

మారువేషంలో జగన్ దగ్గరే జడ్జిలపై దూషణల కేసు నిందితుడు !

హైకోర్టు న్యాయమూర్తులపై దూషణల కేసులో చాలా మంది విదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతిపరులపై కేసులు పెట్టారు. ఎక్కడో ఉన్నాను కదా.. తననేమీ పీకలేరన్నట్లుగా పోస్టులు పెట్టి, న్యాయమూర్తుల్ని బూతులు తిట్టిన వారిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close