తెదేపా ప్రభుత్వం ఇన్నాళ్ళకి ధైర్యం చేయగలిగింది

రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిచ్చిన హామీలన్నిటినీ అమలు చేయమని రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతున్నారు. తెదేపా,భాజపాలు మిత్రపక్షాలుగా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉంటున్నపటికీ తెదేపా వాటి గురించి కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదని రాష్ట్రంలో ప్రతిపక్షాలు చాలా కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందిస్తున్నాయి. భాజపాతో తన సంబంధాలను కాపాడుకోవడానికి ఆయన రాష్ట్ర ప్రయోజనాలను మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారని నిత్యం విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం చాలా అవసరమనే కారణంతో ఇంత కాలం చంద్రబాబు నాయుడు హామీల అమలు కోసం కేంద్రంతో ఘర్షణకి సిద్దపడలేదు. కానీ నిన్న పార్లమెంటు ఉభయసభలలో వాటి గురించే చర్చ జరగడంతో, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే మంచి అదునని చంద్రబాబు నాయుడు భావించి, ఆ హామీల గురించి బుధవారం శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టి, వాటిని తక్షణమే అమలుచేయాలని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు.

దీని కోసం నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెదేపా శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. దానిలో ఇంత వరకు కేంద్రం అమలుచేసిన హామీల గురించి చర్చించి, ఇంకా అమలు చేయవలసి ఉన్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి వాటి కోసం శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టి తీర్మానం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ విషయం గురించి కేంద్రప్రభుత్వానికి ముందే తెలియజేయాలని నిర్ణయించారు. శాసనసభలో తీర్మానం చేసి పంపుతున్నపటికీ, కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించకుండా, స్నేహపూర్వకంగా ఉంటూనే రాష్ట్రానికి రావలసినవన్నీ రాబట్టుకొందామని చంద్రబాబు నాయుడు చెప్పారు. కనుక ఈ తీర్మానం కేవలం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి మాత్రమేనని స్పష్టం చేసారు.

కారణాలు ఏవయితేనేమి, ఎట్టకేలకు తెదేపా ప్రభుత్వం తనంతట తానుగా హామీల అమలు గురించి మళ్ళీ శాసనసభలో చర్చించడానికి సిద్దపడింది. ఇంతకాలంగా తాము ఎంతగా చెపుతున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మళ్ళీ నిందించకమానరు. అలాగే మళ్ళీ ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామాలకు మళ్ళీ డిమాండ్ చేయకామానరు. తెదేపా ప్రభుత్వం ఒకపక్క సభలో వైకాపాని ఎదుర్కొంటూనే మరో పక్క మిత్రపక్షంగా ఉన్న భాజపాని కూడా ఎదుర్కోవలసి రావచ్చును. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయాలని చూస్తే, సభలో భాజపా సభ్యులు తీవ్ర అభ్యతరం తెలపవచ్చును కనుక వారిని నొప్పించకుండా సభలో చర్చను కొనసాగించవలసి ఉంటుంది.

ఈ 22 నెలలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏమేమి చేసిందో సభాముఖంగా ప్రజలకు వివరించి చెప్పేందుకు భాజపాకి కూడా ఇది చాలా మంచి అవకాశం కనుక దానిని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. కేంద్ర పధకాలను తమ స్వంతవిగా తెదేపా ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోందని ఆరోపిస్తున్న భాజపా నేతలు, ఈరోజు చర్చలో ఆ విషయం గురించి కూడా తెదేపా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చును. దానిపై ఇరు పార్టీల సభ్యుల మధ్య సభలో వాగ్వాదాలు జరిగినా ఆశ్చర్యం లేదు. కానీ ఈ తీర్మానాన్ని భాజపా సభ్యులు వ్యతిరేకిస్తే అది ప్రజలకు వారి పార్టీ వైఖరి గురించి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది కనుక వారు కూడా దానిని ఆమోదించవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close