ఏపీ బిజెపి నాయకుడు కి గవర్నర్ పదవి..!

విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి వరించింది. ఆయన పేరు ఎక్కడా ప్రచారంలో లేకపోయినా అనూహ్యంగా ఆయనకు పదవిని ఇస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంకు ఆయన గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు చెందిన మరో నేత బండారు దత్తాత్రేయ కూడా చాలా కాలంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయనను తాజాగా.. హర్యానాకు మార్చారు. ఇక నుంచి ఆయన హర్యానా గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్క బీజేపీ నేతకు గవర్నర్ పదవి ఇచ్చినట్లయింది.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా.. బీజేపీ ముఖ్య నేతలు అన దగ్గ వారికి గవర్నర్ పదవులు కేటాయించడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో వీఎస్ రమాదేవి, విద్యాసాగర్ రావు వంటి వారికి కూడా చాన్సులు కల్పించారు. రేపోమాపో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కేంద్రమంత్రివర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే గవర్నర్లను నియమించినట్లుగా తెలుస్తోంది. ఆ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదని.. సంకేతాలు వచ్చాయి. ఏపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కేంద్రమంత్రి లేరు. మరోసారి చాన్సిచ్చే అవకాశం కూడా లేదు. అందుకే.. చాలా కాలం పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన హరిబాబుకు గవర్నర్‌గా చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న ధాపర్ చంద్ గెహ్లాత్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. అంటే ఆయనకు ఉద్వాసన పలకడం ఖాయమన్నమాట. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో మరికొంత మంది పదవులు కోల్పోయే అవకాశం ఉంది. ఎక్కవ మందిని చేర్చుకోనున్నారు. కంభంపాటి హరిబాబుకు… ఈశాన్య రాష్ట్రంలో చోటు కల్పించినా.. గవర్నర్ పదవికి ఉండే గౌరవం వేరని.. ఆయనకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close