“ఒక ఓటు మూడు రాష్ట్రాలు” బీజేపీ కొత్త నినాదమా..?

కాకినాడలో భారతీయ జనతా పార్టీ అప్పుడెప్పుడో… ఒక ప్లీనరీ లాంటి సమావేశం నిర్వహించుకుని… ఒక ఓటు రెండు రాష్ట్రాలనే తీర్మానం చేసింది. ఇప్పట్లాగే అప్పట్లో బీజేపీని పట్టించుకునేవారు లేరు కాబట్టి.. ఆ తీర్మానాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ తర్వతా ఆ తీర్మానమే ఏకుమేకైంది. నిన్నటికి నిన్న కాకినాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావశం జరిగింది. ఇందులోనూ.. అలాంటి తీర్మానం లాంటి ఛాయలు స్పష్టంగా కనిపించింది. ప్రత్యేకంగా తీర్మానం చేయలేదు కానీ.. తమ తమ మాటల్లో మాత్రం.. ఒక్క ఓటు .. మూడు రాష్ట్రాలనే వాదనను.. గట్టిగానే వినిపించే ప్రయత్నం చేశారు. రాజకీయ తీర్మానంలో ఇదే అంశాన్ని అంతర్గీలనంగా గట్టిగానే చొప్పించారు. ఏ ప్రాంతానికి చెందిన నేతలు ఆ ప్రాంతంలో విభజన బీజాలు నాటాలనే పద్దతిలో.. సమావేశంలో చర్చించుకున్నారు. బయట కూడా అవే చెప్పారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారట. సాగునీటి ప్రాజెక్టులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించడం లేదట. రాష్ట్రంలో పాల డెయిరీలు నష్టాలతో మూత పడుతుంటే..చంద్రబాబు కుటుంబ డెయిరీ మాత్రం లాభాలతో వృద్ధి చెందుతోందట. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై చంద్రబాబు మాట ఇచ్చి తప్పారట. ఏపీలో పెట్రోలు ధర ఎక్కువ ఉండడానికి రాష్ట్ర పన్నులే కారణమట. కర్నూలులో గవర్నర్ గెస్ట్‌హౌస్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం రాజకీయ తీర్మానంలో.. చంద్రబాబును దెబ్బకొట్టాలంటే.. విభజన వాదం వినిపించడం మినహా.. వేరే దారి ఏదీ బీజేపీ నేతలకు కనిపించలేదు.

ఈ సమావేశంలో… ఏపీకి సంబంధించిన ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొన్నారు. కానీ ఒక్కరంటే.. ఒక్కరు కూడా.. విభజన హామీల విషయంలో కేంద్రం నుంచి ఇంకా ఏమేమి రావాల్సి ఉన్నాయి.. ? ఎందుకు చేయలేకపోతున్నాం..? అని ఒక్కరు కూడా ప్రశ్నించకోలేదు. ఇదిగో రైల్వేజోన్ అన్నారు.. అదిగో కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు. కానీ ఒక్కరికీ అవేమీ గుర్తుకు రాలేదు. కానీ… రాయలసీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం దరిగిపోతందని మాత్రం గగ్గోలు పెట్టేందుకు సిగ్గుడలేదు. ఉత్తరాంధ్రకు రైల్వేజోన్ ఇవ్వకుండా.. కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా… అత్యంత దారుణంగా నమ్మకద్రోహం చేసింది బీజేపీనే. వాళ్లే ప్రజల మనసుల్లో విష బీజాలు నాటేందుకు బయలుదేరారు. ప్రస్తుతం బీజేపీ నేతల భావ దారిద్య్రం చూస్తూంటే.. ఒక్క ఓటుకు మూడు రాష్ట్రాలని ప్రచారం చేసుకుని ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదన్నట్లుగా పరిస్థితి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close