పోలవరం మీరే తీసుకోండి..! కేంద్రానికి ఏపీ బీజేపీ నివేదిక..!

ఆదివారం కేంద్ర జలశక్తి మంత్రిని ఏపీ బీజేపీ బృందం కలవనుంది. శుక్రవారం వారు ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఓ నివేదిక తయారు చేశారు. దాన్ని మంత్రికి అందించనున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్టు పనులు చేపడుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణమైన ఏర్పాట్లు అక్కడ ఏమీ జరగడం లేదని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. నవయుగ ఇప్పటికే మెషినరీ మొత్తాన్ని తరలించేసింది. మేఘాకు ఇంకా కాంట్రాక్టు ఖరారు కాలేదు. ఇరవై రోజుల్లో మిషనరీని ప్రాజెక్ట్ సైట్‌కి తెప్పించడం అసాధ్యమని బీజేపీ నేతలు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లు కాంట్రాక్టర్ ను మార్చడం వల్ల సమన్వయ లోపంతో పాటు, న్యాయపరమైన చిక్కులు, ఆర్ధిక భారం, జాప్యం జరుగుతుందని చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణ పనులు నాలుగు నెలల నుంచి పూర్తిగా నిలిచిపోవడం, న్యాయపరమైన చిక్కులను అధిగమించి, ప్రాజెక్టు నిర్మాణ పనులును చేపట్టేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని బీజేపీ బృందం అంచనాకు వచ్చింది. ఇదే అంశాన్ని కేంద్ర జలవనరులశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. 13వ తేదీ సాయంత్రం ప్రతినిధి బృందం కేంద్ర జలవనరులశాఖను కలిసి తమ నివేదికను ఇవ్వనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ బృందం వాదిస్తోంది. ఈనెల 16వ తేదీన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ఉండటంతో ఆ రోజుకి పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం వైఖరిని స్పష్టం చేయాలని ప్రతినిధి బృందం కేంద్ర మంత్రిని కోరనుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే తీసుకుని పూర్తి చేయాలనే నివేదికను.. కన్నా బృందం సిద్ధం చేసింది. బీజేపీ బృందం ఇచ్చే నివేదిక తర్వాత కేంద్రం .. పీపీఏకు స్పష్టమైన సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు పదహారో తేదీన పోలవరంపై నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close