పవన్‌ కోసం మాట్లాడరు కానీ బద్వేలులో మాత్రం ఉమ్మడి అభ్యర్థిట..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల వ్యవహార శైలి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌పై వైసీపీ అగ్రనాయకత్వం బూతుల దాడి చేస్తున్న బీజేపీ నేతలు స్పందించడం లేదు. పవన్‌కు మోరల్ సపోర్ట్‌గా రెండు మాటలు మాట్లాడుదామన్న ఆలోచన చేయలేదు. కానీ బద్వేలు ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే సరికి మాత్రం ఉమ్మడి అభ్యర్థి అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెరపైకి వచ్చేశారు. జనసేనతో మాట్లాడి అభ్యర్థిని ఖారరు చేస్తామని ప్రకటించారు. బీజేపీ సీటు అడుగుతుందో లేదో ఆయన చెప్పలేదు.

తిరుపతి ఉపఎన్నికల్లో తామంటే తాము పోటీ చేస్తామని రెండు పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డారు. చివరికి పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతివ్వక తప్పని పరిస్థితి కల్పించారు. కానీ ఆ ఎన్నికల్లో వారిద్దరి మధ్య పొత్తు వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు బద్వేలు ఉపఎన్నికల్లో రెండు పార్టీల తరపున ఎవరు పోటీ చేసినా ప్రయోజనం ఉండదు. గత ఎన్నికల్లో రెండు పార్టీలకు కలిపి అక్కడ నోటా కంటే కూడా ఎక్కువ ఓట్లు రాలేదు. 2019 ఎన్నికల్లోనూ జనసేన పార్టీ అక్కడ పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా బహుజన సమాజ్ పార్టీకి కేటాయించారు. జనసేన మద్దతిచ్చిన బీఎస్పీ 1321 ఓట్లు సాధించి ఆరో స్థానంలో ఉంటే ఒంటరిగా పోటీచేసిన బీజేపీ ఇంకా దారుణమైన ఫలితాన్ని చూసింది.

పైగా బీజేపీ తరపున పోటీ చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిరువీధి జయరాములు. వైసీపీ తరపున గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరారు. అక్కడ టిక్కెట్ ఇవ్వరన్న ఉద్దేశంతో బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. మొత్తంగా 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు పార్టీల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. నోటా నాలుగో స్థానంలో ఉంది. అసలు బద్వేలు ఉపఎన్నికపై జనసేన ఏ విధానం తీసుకుంటుందో ఇంకా స్పష్టత లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close