నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

నేడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజధానికి మిగిలిన భూముల సేకరణ, హైదరాబాద్ నుండి ఉద్యోగులు, ప్రభుత్వ శాఖల తరలింపు, మచిలీపట్నం ఓడరేవు, విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రామంలో విమానాశ్రయానికి భూసేకరణ, ఈ నెల 9 నుండి ప్రభుత్వం మొదలుపెట్టబోతున్న చంద్రన్న రైతు యాత్ర తదితర అంశాల గురించి చర్చిస్తారు. ఇప్పటికే రాజధాని భూసేకరణలో రైతుల నుండి ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి మచిలీపట్నం, భోగాపురం రైతులు కూడా భూసేకరణని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక ఈ సమావేశంలో ఈ సమస్యపైన ప్రధానంగా చర్చ జరుగవచ్చును. రాజధాని నిర్మాణ పనులు వచ్చేనెల 22న దసరా నుండే మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నందున పెనుమాక తదితర గ్రామాలలో భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల నుండి ఏవిధంగా భూమి సేకరించాలనే అంశంపై కూడా చర్చ జరుగవచ్చును. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలు, బందులు, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆత్మహత్యలు వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగవచ్చును. ఈ సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురుపూజా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close