అమరావతి శంఖుస్థాపనకి ముహూర్తం ఖరారు

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖు స్థాపనకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబరు 22న మధ్యాహ్నం 12.45గంటలకు ముహూర్తంగా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రాజధానికి శంఖు స్థాపన చేస్తారు. ప్రధానితో బాటు జపాన్, సింగపూర్ దేశాల ప్రధానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సుమారు లక్ష మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తోంది.శంఖుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించే బాధ్యతని ముంబై కి చెందిన విజ్ క్రాఫ్ట్స్ అనే ఈవెంట్ మేనేజి మెంట్ సంస్థకు అప్పగించారు. ఈ నెల 13నుండి 22వరకు రాజధాని శంఖు స్థాపన కార్యక్రమాన్ని ఒక పండుగలాగ నిర్వహించబోతున్నట్లు మంర్తి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

ప్రస్తుతం ఉద్దండరాయునిపాలెం ఉన్న ప్రదేశంలో 25 ఎకరాలలో ఆంద్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిభింబించే విధంగా ఒక పైలాన్ నిర్మించబోతోంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఎంత భూమి ఇచ్చినది వగైరా అన్ని వివరాలతో కూడిన శిలాఫలకాలు అక్కడ ఏర్పాటు చేస్తారు. అదే విధంగా రాజధానికి ఎవరెవరు ఎంత సహాయం చేసినది, రాజధాని నిర్మాణంలో ఏఏ సంస్థలు పాలుపంచుకొన్నాయో వాటి వివరాలు అన్నీ నిక్షిప్తం చేస్తూ ఒక శిలాఫలకాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల నుండి సేకరించిన మట్టితో అక్కడ ఒక కలశం ఏర్పాటు చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close