జగన్, రఘువీరా రెడ్డిపై చంద్రబాబు విమర్శలు

జగన్మోహన్ రెడ్డి, రఘువీరా రెడ్డి నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పేరు పెట్టి మరీ విమర్శిస్తూనే ఉంటారు కానీ ఆయన మాత్రం నేటికి వారిని ఉద్దేశ్యించి పరోక్ష విమర్శలే చేస్తుంటారు. శనివారం ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వారిరువురిపై విమర్శలు గుప్పించారు.

“మనకి ఓ మహానాయకుడున్నాడు. అతనికి రాజకీయాలు తెలియవు. దేని గురించి అవగాహన ఉండదు. కానీ మొన్న కర్నూలులో ఏదేదో మాట్లాడేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే దొంగ లెక్కలు వ్రాసుకొన్నంత తేలిక కాదు. మరొక నాయకుడు ఉన్నారు. అతని వెనుక ఎవరూ ఉండరు. కానీ ఆయన ఒక్కడే చాలా మాట్లాడుతుంటారు. దాని వలన తన పార్టీ విశ్వసనీయత, భవిష్యత్ దెబ్బ తింటోందని కూడా గ్రహించరు. వాళ్లకి రాజకీయాలే ముఖ్యం కావచ్చు కానీ నాకు రాష్ట్రం, ప్రజలు, వారి ప్రయోజనాలు, అభివృద్దే ముఖ్యం. అందుకోసం నా శక్తిమేర కృషి చేస్తూనే ఉంటాను,’ అని అన్నారు. వారిలో మొదటి వ్యక్తి జగన్, రెండవ వ్యక్తి రఘువీర రెడ్డి అని అర్ధమవుతూనే ఉంది.

ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు మళ్ళీ తన ద్వంద వైఖరిని మరోమారు బయటపెట్టుకొన్నారు. “ప్రత్యేక హోదా వస్తే నేనేమైనా వద్దంటానా? వస్తే నాకు సంతోషమే. కానీ పదేళ్ళ క్రితం హోదా పొందిన 10 రాష్ట్రాలు నేటికీ అభివృద్ధి సాధించలేకపోయాయి. ఇంకా వెనుకబడే ఉన్నాయి. 14వ ఆర్ధిక సంఘంమే ఆ విషయం స్పష్టం చేసింది. విభజన తరువాత మనం కట్టుబట్టలతో బయటకు వచ్చేము.అందరం కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని నిలబెట్టుకొంటున్నాము. రాష్ట్రానికి న్యాయం చేయాలని నేను డిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులని పదేపదే అడగవలసి వస్తోంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. ప్రజాభీష్టానికి విరుద్ధంగా తన ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొంది. రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు రాష్ట్రం కోసం మొసలి కన్నీళ్లు కార్చుతోంది. అదే ఈ సమస్యలను సృష్టించి, మళ్ళీ అదే మనల్ని విమర్శిస్తోంది,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close