హైకోర్టు విభజనపై చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణపనుల పురోగతిని సమీక్షించిన తరువాత హైకోర్టు విభజనపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ప్రభుత్వం వారి సమస్యల గురించే మాట్లాడుతోంది తప్ప విభజన సమస్యల గురించి మాట్లాడటం లేదు. హైకోర్టు విభజన ఒకటే కాకుండా ఇంకా అనేక సమస్యలు నేటికీ అపరిష్క్రుతంగా ఉండిపోయాయి. వాటి గురించి మాట్లాడటం లేదు. రెండు రాష్ట్రాల మద్య ఉన్న సమస్యలని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి నేను సిద్దంగా ఉన్నానని మొదటి నుంచి చెపుతూనే ఉన్నాను. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొంటూ అభివృద్ధి సాధించాలి,” అని అన్నారు.

హైకోర్టు విభజన గురించి గట్టిగా మాట్లాడుతున్న తెలంగాణా ప్రభుత్వం షెడ్యూల్:9,10ల క్రింద ఉన్న సంస్థల పంపకాల గురించి మాట్లాడటం లేదు. వాటి గురించి అసలు మాట్లడవలసిందేమీ లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. రాజోలి బండ ప్రాజెక్టు విషయంలో తనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తనంతటతానే చర్చలకి సిద్దమయింది. అదేవిధంగా హైకోర్టు విభజనకి తెలంగాణా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది కనుక దానిని హైలైట్ చేస్తూ దాని గురించి గట్టిగా మాట్లాడుతోంది. మళ్ళీ మిగిలిన విషయాలలో తెలంగాణా ప్రభుత్వం ఆవిధంగా చొరవ చూపదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్న ఇతర సమస్యల గురించి తెలంగాణా ప్రభుత్వం కనీసం ఆలోచించడానికి కూడా ఇష్టపడదు కానీ తన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలని కోరుకొంటుంది. తన సమస్యలే చాలా ముఖ్యమన్నట్లు మాట్లాడుతూ, వ్యవహరిస్తోంది తప్ప ఇతర సమస్యలని పట్టించు కోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వాస్తవమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close